అన్వేషించండి

Bihar Political Crisis: చెత్త తిరిగి చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది - నితీశ్‌పై లాలూ కూతురి సంచలన పోస్ట్

Bihar Political Crisis: నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై లాలూ కూతురు సెటైరికల్ పోస్ట్ పెట్టారు.

Bihar Political Crisis: నితీశ్ కుమార్ రాజీనామాపై లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య (Rohini Acharya) తీవ్రంగా స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనమైంది. "చెత్త అంతా చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది" అని నితీశ్ పేరు ఎత్తకుండానే ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రాజకీయంగా ఈ పోస్ట్‌పై రగడ జరుగుతోంది. మరీ ఇంత తొందరపాటు అవసరమా అని కొందరు మండి పడుతుంటే...RJD సపోర్టర్స్ మాత్రం నితీశ్‌కి ఇలాంటి చురకలు అంటించాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. 2022లో NDA నుంచి బయటకు వచ్చారు నితీశ్ కుమార్. కాంగ్రెస్, RJD మద్దతుతో మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే...మహాఘట్‌బంధన్‌లో ఏదీ సరిగా లేదని, మునుపటి బలం కోల్పోయిందంటూ నితీశ్ ఆరోపించారు. రాజీనామా చేసిన తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కి సెటైర్‌గా రోహిణీ ఆచార్య ఈ పోస్ట్ పెట్టారు. "మొత్తానికి చెత్త అంతా మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది" అంటూ చాలా ఘాటుగా కామెంట్ చేశారు. 

గతంలోనూ పోస్ట్‌లు..

నిజానికి అంతకు ముందు కూడా నితీశ్ కుమార్‌పై ఇలాంటి పోస్ట్‌లే పెట్టి ఆ తరవాత డిలీట్ చేశారు. కొంత మంది RJD నేతలు అప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్‌ని టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్‌లు పెట్టారని వెల్లడించారు. అయితే...కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కి తీసుకున్నారని, అందుకే పోస్ట్‌లను తొలగించారని వివరించారు. అప్పటికే కొంత మంది ఆ పోస్ట్‌లను స్క్రీన్‌షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి. ఆమె అంతగా ఫైర్ అవ్వడానికి కారణం..నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. వారసత్వ రాజకీయాలు అంటూ RJDపై తీవ్ర విమర్శలు చేశారు నితీశ్. సరిగ్గా బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలోనే ఈ కామెంట్స్ చేయడం బిహార్ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఈ వ్యాఖ్యలపైనే రోహిణ ఆచార్య తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు పెట్టి డిలీట్ చేశారు. 

బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ ఉన్న సస్పెన్స్‌కి తెర దించుతూ అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కి తన రాజీనామా లేఖని సమర్పించారు. మహాఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు నితీశ్. "మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతునిస్తాం" అని ఎమ్మెల్యేలు భరోసా ఇవ్వడం వల్ల వెంటనే ఆయన రాజీనామా చేశారు. అటు బీజేపీతో మంతనాలు పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే బీజేపీతో చేతులు కలిపి NDAలో చేరనున్నారు. ఆ తరవాత 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నితీశ్. 

Also Read: Bihar Political Crisis: చావనైనా చస్తాం బీజేపీతో పొత్తు పెట్టుకోం - నితీశ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget