అన్వేషించండి

Bihar Political Crisis: చెత్త తిరిగి చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది - నితీశ్‌పై లాలూ కూతురి సంచలన పోస్ట్

Bihar Political Crisis: నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై లాలూ కూతురు సెటైరికల్ పోస్ట్ పెట్టారు.

Bihar Political Crisis: నితీశ్ కుమార్ రాజీనామాపై లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య (Rohini Acharya) తీవ్రంగా స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనమైంది. "చెత్త అంతా చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది" అని నితీశ్ పేరు ఎత్తకుండానే ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రాజకీయంగా ఈ పోస్ట్‌పై రగడ జరుగుతోంది. మరీ ఇంత తొందరపాటు అవసరమా అని కొందరు మండి పడుతుంటే...RJD సపోర్టర్స్ మాత్రం నితీశ్‌కి ఇలాంటి చురకలు అంటించాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. 2022లో NDA నుంచి బయటకు వచ్చారు నితీశ్ కుమార్. కాంగ్రెస్, RJD మద్దతుతో మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే...మహాఘట్‌బంధన్‌లో ఏదీ సరిగా లేదని, మునుపటి బలం కోల్పోయిందంటూ నితీశ్ ఆరోపించారు. రాజీనామా చేసిన తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కి సెటైర్‌గా రోహిణీ ఆచార్య ఈ పోస్ట్ పెట్టారు. "మొత్తానికి చెత్త అంతా మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది" అంటూ చాలా ఘాటుగా కామెంట్ చేశారు. 

గతంలోనూ పోస్ట్‌లు..

నిజానికి అంతకు ముందు కూడా నితీశ్ కుమార్‌పై ఇలాంటి పోస్ట్‌లే పెట్టి ఆ తరవాత డిలీట్ చేశారు. కొంత మంది RJD నేతలు అప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్‌ని టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్‌లు పెట్టారని వెల్లడించారు. అయితే...కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కి తీసుకున్నారని, అందుకే పోస్ట్‌లను తొలగించారని వివరించారు. అప్పటికే కొంత మంది ఆ పోస్ట్‌లను స్క్రీన్‌షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి. ఆమె అంతగా ఫైర్ అవ్వడానికి కారణం..నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. వారసత్వ రాజకీయాలు అంటూ RJDపై తీవ్ర విమర్శలు చేశారు నితీశ్. సరిగ్గా బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలోనే ఈ కామెంట్స్ చేయడం బిహార్ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఈ వ్యాఖ్యలపైనే రోహిణ ఆచార్య తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు పెట్టి డిలీట్ చేశారు. 

బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ ఉన్న సస్పెన్స్‌కి తెర దించుతూ అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కి తన రాజీనామా లేఖని సమర్పించారు. మహాఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు నితీశ్. "మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతునిస్తాం" అని ఎమ్మెల్యేలు భరోసా ఇవ్వడం వల్ల వెంటనే ఆయన రాజీనామా చేశారు. అటు బీజేపీతో మంతనాలు పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే బీజేపీతో చేతులు కలిపి NDAలో చేరనున్నారు. ఆ తరవాత 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నితీశ్. 

Also Read: Bihar Political Crisis: చావనైనా చస్తాం బీజేపీతో పొత్తు పెట్టుకోం - నితీశ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Embed widget