అన్వేషించండి

Bihar Political Crisis: చావనైనా చస్తాం బీజేపీతో పొత్తు పెట్టుకోం - నితీశ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్

Bihar Political Crisis: బీజేపీతో పొత్తుపై గతంలో నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Bihar Political Crisis: 

"మేం ఎప్పుడో తలుపులు మూసేశాం. నితీశ్‌కి ఎంట్రీ లేనే లేదు" - బీజేపీ

"చావనైనా చస్తాం కానీ..బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోనే పెట్టుకోం" - నితీశ్ కుమార్ 

ఏడాది క్రితం సంగతి ఇదంతా. 2022లో NDA నుంచి బయటకు వచ్చేశారు నితీశ్ కుమార్. అప్పుడు RJD,కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపైనే కాకుండా బీజేపీ సిద్ధాంతాలపైనా గట్టిగానే విమర్శలు చేశారు. కొంత మంది తమను తామే జాతిపితలా ఊహించుకుంటున్నారంటూ మోదీపై సెటైర్లు కూడా వేశారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదన్న నానుడిని మరోసారి రుజువు చేశారు నితీశ్. అటు బీజేపీ కూడా మూసిన తలుపులని తెరిచి మరీ నితీశ్‌ని ఆహ్వానిస్తోంది. కానీ..గతంలో చాలా సార్లు మీడియా ప్రశ్నించినప్పుడు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారంటూ మండి పడ్డారు. చివరకు మళ్లీ అదే పార్టీతో చేతులు కలుపుతున్నారు. ఆయన గతంలో చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆయన ఏమన్నారంటే..

"ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. అసలు ఆ ప్రశ్నే వద్దు. చనిపోవడానికైనా వెనకాడం. కానీ...వాళ్లతో మాత్రం కలిసి ముందడుగు వేసేదే లేదు. అలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి. ఇలాంటి పుకార్లు ఎందుకు పుడుతున్నాయో తెలీదు" 

-నితీష్ కుమార్, బిహార్ సీఎం 

గత కొన్ని రోజుల్లోనే అటు మమతా బెనర్జీ, ఇటు ఆప్‌ కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు నితీశ్ కూడా అదే దారిలో నడిచారు. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఓ కూటమి నుంచి మరో కూటమికి మారుతూ వచ్చారు. NDA,మహాఘట్‌బంధన్ మధ్యే అటూ ఇటూ తిరుగుతున్నారు. 2022లో ఆయన NDA నుంచి బయటకు వచ్చి RJD మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆయన మహాఘట్‌బంధన్‌ని వీడి NDAలో చేరిపోతారన్న గుసగుసలు వినిపించాయి. అవి నిజమయ్యాయి కూడా. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. జనవరి 30వ తేదీన ఈ యాత్ర బిహార్‌కి చేరుకుంటుంది. అయితే...ఈ యాత్రలో పాల్గొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తి చూపించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ పరిణామంతోనే ఆయన కూటమి నుంచి బయటకు వస్తారన్న సంకేతాలొచ్చాయి. 

2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో JDU,RJD, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌నే వరించింది. అయితే..ఈ మహాఘట్‌బంధన్‌లో కొన్ని విభేదాలు తలెత్తాయి. సైద్ధాంతికంగా ఒక పార్టీ మరో పార్టీతో విభేదించింది. ఫలితంగా...2017 జులైలో మహాఘట్‌బంధన్‌ నుంచి తప్పుకున్నారు. వెంటనే బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరవాత అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి 2022లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. NDA నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీతో సరిపడడం లేదంటూ తేల్చి చెప్పారు. RJD,కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Also Read: CM Nitish Kumar Resigns: బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా, మహాఘట్‌బంధన్‌కి గుడ్‌బై

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
PM Narendra Modi: రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
Anna Konidela : అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా లెజినోవా - రేర్ ఫ్యామిలీ ఫోటో
అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా కొణిదెల - రేర్ ఫ్యామిలీ ఫోటో
Embed widget