By: Ram Manohar | Updated at : 19 Dec 2022 06:30 PM (IST)
బిహార్లోని బేగుసరైలో ఓ వంతెన ప్రారంభించక ముందే కుప్ప కూలింది. (Image Credits: ANI)
Begusarai Bridge Collapse:
బేగుసరైలో కూలిన బ్రిడ్జ్..
బిహార్లోని బేగుసరైలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. బుర్హీ గందక్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ఉన్నట్టుంది కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాత్కాలికంగా వంతెనను మూసివేశామని బేగుసరై జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. రెండు పిల్లర్ల మధ్య పగుళ్లు రావడం వల్ల కూలిపోయినట్టు తేలింది. "బేగుసరైలోని బుర్హీ గందక్ నదిపై నిర్మించిన వంతెన కూలిపోయింది. అంతకు ముందే వంతెనపై చాలా చోట్ల పగుళ్లు వచ్చాయి. తాత్కాలికంగా ఈ బ్రిడ్జ్ను మూసివేశాం. ఎందుకు కూలిపోయిందో విచారణ చేపడుతున్నాం" అని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. 206 మీటర్ల పొడవైన వంతెనను మా భగవతి కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మించింది. ముఖ్యమంత్రి నాబార్డ్ పథకం కింద ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. 2016 ఫిబ్రవరిలోనే ఈ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. 2017లో పూర్తి చేశారు. అయితే...అప్రోచ్ రోడ్ లేని కారణంగా బ్రిడ్జ్ను ప్రారంభించలేదు. అప్పటి నుంచి కేవలం లైట్ వెహికిల్స్ను మాత్రమే దీనిపై అనుమతిస్తున్నారు. అయితే...ఈ మధ్యే రెండు, మూడు పిల్లర్లపై పగుళ్లు వచ్చాయి. ఫలితంగా...వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. "బ్రిడ్జ్ను అధికారికంగా ప్రారంభించకపోయినా...చిన్నపాటి వాహనాలను అనుమతించాం. ఈ వంతెన మూడు పంచాయతీలను కలుపుతోంది" అని అధికారులు చెప్పారు.
#WATCH | Bihar: A portion of a bridge that was built across Burhi Gandak River in Sahebpur Kamal, Begusarai collapsed and fell into the river yesterday. The bridge had developed cracks a few days back. Nobody was on the bridge at the time of the incident. pic.twitter.com/zB7L3bAOPA
— ANI (@ANI) December 19, 2022
కల్తీ మద్యం కాటు..
బిహార్ లోని ఛాప్రా జిల్లాతో పాటు సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు నమోదవుతున్నాయి. వారి మరణానికి మద్యం సేవించడం కారణమని చెప్పకూడదని, లేదంటే వారిని జైలుకు పంపుతామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, సీఎం మౌనం, అధికారుల మద్దతు మరిన్ని అనుమానాలకు కారణం అని జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆరోపించారు. మద్యపానం నిషేధించిన రాష్ట్రం బిహార్ లో కల్తీ మద్యం మరణాలు ఆందోళన పెంచుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2016లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యంపై నిషేధం విధించినా.. బిహార్ లో తరచుగా కల్తీ మద్యం మరణాలు నమోదవుతుంటాయి. ఇటీవల పెళ్లి వేడుకల్లో స్థానికంగా తయారుచేసి మహువా, దేశీ మద్యం సేవించిన తరువాత వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవించాయి.
Also Read: Toronto Shooting: కెనడాలో కాల్పుల కలకలం, ఐదుగురు మృతి - అనుమానితుడిని కాల్చేసిన పోలీసులు
Nikhat Zareen: హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్ - ఘనస్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ రెడ్డి
Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్
Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం
నిజామాబాద్లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్ఎస్ సైటర్- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!
PPF: పీపీఎఫ్ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?