By: ABP Desam | Updated at : 10 Jun 2022 03:34 PM (IST)
"బికాజ్ ఐ లవ్ కాంగ్రెస్ " ... జేడీఎస్ ఎమ్మెల్యేల వాదన
Karnataka Politics : నాలుగు రాజ్యసభ స్థానాలకు కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆరు మంది పోటీలో నిలబడ్డారు. ఎవరికి వారు ఓట్లు వేసుకుంటే అసలు పోటీ ఉండేది కాదు. ఏకగ్రీవం అయ్యేది. కానీ ఒకరి ఓట్లపై మరొకరు ఆశలు పెట్టుకుని... అభ్యర్థుల్ని నిలబెట్టారు. అనుకున్నట్లుగానే పోలింగ్ జరిగింది. ఎవరి ఓట్లు వారు వేసుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ... తమ పార్టీకి కాకుండా ఇతర పార్టీకి ఓటు వేశారు. వారిద్దరూ జేడీఎస్కు చెందిన వారు. కానీ వారు ఓటు వేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత మీడియా చుట్టు ముట్టింది. సొంత పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎలా ..ఎందుకు ఓటు వేశారని ప్రశ్నించింది. దానికి వారు చెప్పిన సమాధానం ఇది.
Two JDS MLAs Mr Srinivas Gowda and Mr Srinivas Gubbi cross voted in favour of Congress candidate
When Asked Why ? The reply 👇🏽#Karnataka #RajyaSabhaPolls pic.twitter.com/PrQN5zxycI— Supriya Bhardwaj (@Supriya23bh) June 10, 2022
కాంగ్రెస్ పార్టీని లవ్ చేస్తున్నారట. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారట. అంటే ఇంత కాలం కాంగ్రెస్ పార్టీని ప్రేమిస్తూ జేడీఎస్లో ఉన్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
నాలుగు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో రెండు బీజేపీకి , ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఖాయంగా వస్తాయి. మరో రాజ్యసభ స్థానం గెల్చుకోవాలంటే 45 ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ఇద్దరు రాజ్యసభ సభ్యుల్ని గెలిపించుకున్నతర్వాత బీజేపీకి 32 ఓట్లు ఉంటాయి. జేడీఎస్కు 32 ఉంటాయి. కాంగ్రెస్కు అందరి కంటే తక్కువగా 24 ఓట్లు ఉంటాయి. ఎలా చూసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే చాన్స్ లేదు. సమాన ఓట్లు ఉన్న బీజేపీ , జేడీఎస్లలో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు జేడీఎస్ ఓట్లను కాంగ్రెస్ చీల్చడం వల్ల బీజేపీ అభ్యర్థికి మేలు జరగనుంది.
అందుకే జేడీఎస్ నేత కుమారస్వామి కాంగ్రెస్ పై మండిపడ్డారు. బీజేపీని బలపరుస్తున్నారని విమర్శించారు. పార్టీని ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాము ప్రేమిస్తున్నట్లుగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే.
ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు
Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్