అన్వేషించండి

Ram Mandir: చూపు తిప్పుకోనివ్వని అయోధ్య రామయ్య రూపం, ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనం

Ram Mandir Inauguration: అయోధ్య బాల రాముడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ramlala Pran Pratishtha: అయోధ్య బాల రాముడు ఎలా ఉంటాడో అన్న ఉత్కంఠకు తెరపడింది. ఇప్పటి వరకూ బాల రాముడి ముఖం కనిపించకుండా కవర్ చేశారు. ఆ తరవాత ఆ గంతలు తొలగించారు. దీంతో బాల రాముడి దివ్య రూపం దర్శించేందుకు అవకాశం లభించింది. పూర్తిగా కృష్ణ శిలతో తయారు చేసిన బాల రాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణ ప్రతిష్ఠ రోజున కళ్లపై ఉన్న తెరను తొలగిస్తారు. కానీ...అంత కన్నా ముందే అందరికీ దర్శనమిచ్చాడు అయోధ్య రాముడు. బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకుంది. ప్రాణ ప్రతిష్ఠ తరవాత అందరికీ దర్శనమిస్తాడనుకున్నా..అంత కన్నా ముందే కనిపించాడు. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది. ఈ విగ్రహం పొడవు 5 అడుగులు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మొత్తం 8 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపారు. వీళ్లలో బిలియనీర్ ముకేశ్ అంబానీ, బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌ ఉన్నారు. జనవరి 22న లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిపించనున్నారు. అయోధ్య ఉత్సవాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలు ఆ రోజున సెలవు ప్రకటించాయి. 

Ram Mandir: చూపు తిప్పుకోనివ్వని అయోధ్య రామయ్య రూపం, ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనం

ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి నిరాకరించారు. 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్టు ప్రకటించింది. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానం పంపారు. 
అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్‌, హాంకాంగ్, కెనడా, ఇటలీ, ఐర్లాండ్‌, మెక్సికో, న్యూజిలాండ్‌ సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నారు. జనవరి 20న లక్నో చేరుకోనున్న విదేశీ అతిథులు...ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను పరిశీలించారు. చివరికి అరుణ్ యోగిరాజ్‌ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. అయోధ్యలో కొలువు దీరే రాముడి కోసం ఉడతాభక్తిగా ఏదో చేయాలన్న సంకల్పం అందరిలో కనిపిస్తంది. అలా ఆలోచించిన గుజరాత్‌లోని ఓ గ్రామం వినూత్నంగా అగరబత్తిని తయారు చేసింది. గుజరాత్‌ వడోదరలోని తర్సాలీ గ్రామం ఓ భారీ ప్రయత్నం చేసి సఫలీకృతమైంది. అయోధ్య రాముడి కోసం బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. 108 అడుగుల పొడవు, 3.5 వెడల్పుతో భారీగా దూప్‌స్టిక్‌ను వెలిగించారు. రెండు నెలల పాటు శ్రమించి ఈ భారీ అగరబత్తిని తయారు చేశారు. 

Also Read: Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?

 

 

టాప్ హెడ్ లైన్స్

Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget