అన్వేషించండి

EAPCET Results 2021: ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..  ఈ లింక్ క్లిక్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)- 2021  పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగానికి మాత్రమే ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 14న అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు. 1,66,462 మంది పరీక్షలు రాయగా.. 1,32,233 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. ఉత్తీర్ణతా శాతం 80.62గా ఉందని చెప్పారు. అభ్యర్థులు తమ ఫలితాలను ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఈఏపీసెట్ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ (JNTUK) నిర్వహిస్తోంది. 

ఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,76,603 మంది అప్లై చేసుకోగా.. 1,66,460 మంది హాజరయ్యారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు.. గత నెల 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇవి ఈ నెల 3, 6, 7 తేదీల్లో జరిగాయి. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు మొత్తం 5 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 88,822 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా.. 78,066 మంది హాజరయ్యారు. కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా ఈఏపీసెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ నెల 18 నుంచి ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.. 
ఇంజనీరింగ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), ఫార్మా డీ, బీ-ఫార్మసీ, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ కోర్సులలో అడ్మిషన్లు పొందవచ్చు. 

ఇంట‌ర్ వెయిటేజీ తొల‌గింపు..
ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల‌లో ప్రవేశాలకు ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కుల‌ను తొలగిస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. కోవిడ్ కార‌ణంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది. గ‌తేడాది వ‌ర‌కు ఈ ప్రవేశ ప‌రీక్ష‌ల‌లో విద్యార్థుల ఇంట‌ర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారమని.. ఈ ఏడాది దీనిని తొల‌గించిన‌ట్లు రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈఏపీసెట్ రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్ స్ప‌ష్టం చేశారు. 

Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..

Also Read: ANGRAU Admissions 2021: ఏపీ వ్యవసాయ పాలిటెక్సిక్ కోర్సుల్లో ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటివరకు అంటే?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
Vaibhav Sooryavanshi T20 Series Debate: ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget