అన్వేషించండి

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

CM Jagan Kadapa Tour: ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారు అయింది. డిసెంబర్ 2, 3వ తేదీల్లో జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు.

CM Jagan Kadapa Tour: ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన కన్ఫామ్‌ అయింది. పర్యటన వివరాలను కలెక్టర్ విజయరామరాజు మంగళవారం వెల్లడించారు. సీఎం జగన్ డిసెంబర్ 2, 3వ తేదీల్లో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. డిసెంబర్ రెండో తేదీ ఉదయం ముఖ్యమంత్రి జగన్.. తన నివాసం నుంచి 1.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.15 గంటలకు స్థానిక నేతలతో మాట్లాడతారు. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు.

వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ ను ప్రారంభించనున్న సీఎం జగన్..

మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టీని ప్రారంభిస్తారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్ కు బయలు దేరుతారు. 12.40 గంటలకు అక్కడకు చేరుకొని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అంటే నాలుగు గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకు హెలికాప్టర్ లో ఇడుపులపాయ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఓ పది నిమిషాల పాటు స్థానిక నేతలతో మాట్లాడి.. 5.20 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్ హౌజ్ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 

డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్ కు చేరుకుంటారు. అక్కడ 9.15 నుంచి 9.30 వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం 9.45 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.

నేడు మదనపల్లెకు సీఎం జగన్..

ఏపీ సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నిధులు విడదల చేయబోతున్నారు. 2022వ సంవత్సరానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను జగన్‌ మదనపల్లెలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget