అన్వేషించండి

CM Chandrababu Naidu Delhi Tour: ప్రధాని మోదీ ఏడు సూత్రాలు ఒక జాతీయ మిషన్ .. ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి - సీఎం చంద్రబాబు పిలుపు

PM Modi Seven Appeals :ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఏడు అప్పీల్స్ జాతీయ మిషన్ లాంటివని ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రతి పౌరుడు సహకరించాలని ఢిల్లీ వేదికగా పిలుపునిచ్చారు.

CM Chandrababu supports PM Modi Seven Appeals : దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను   బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏడు విజ్ఞప్తులు జాతీయ మిషన్  అని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పూర్తి మద్దతు ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ  వార్షిక వ్యాపార సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతి భారతీయుడు ఈ పిలుపును ఒక బాధ్యతగా స్వీకరించాలని కోరారు.

 సంక్షోభ సమయంలో స్వావలంబనే మార్గం 

ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు భారతదేశం తన వనరులను పొదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధనం,  ఎరువుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రధాని చేసిన సూచనలను ఆయన సమర్థించారు.  ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్న తరుణంలో, యుద్ధంతో నేరుగా సంబంధం లేని దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో పొదుపు మంత్రమే మనల్ని కాపాడుతుంది  అని ఆయన వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు  సమర్థించిన ప్రధాని చెప్పిన ఏడు సూత్రాలు 

ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా సూచించిన అంశాలను చంద్రబాబు పారిశ్రామికవేత్తల ముందుకు తెచ్చారు 

1.  వర్క్ ఫ్రమ్ హోమ్:  ప్రయాణ ఖర్చులు తగ్గించి, సమయాన్ని ఆదా చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి.
2. బంగారు కొనుగోళ్ల వాయిదా: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు కొంతకాలం బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలి.
3.  పొదుపుగా ఇంధన వినియోగం: వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో, ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలి.
4.  సహజ సిద్ధమైన వ్యవసాయం: రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి.
5.  స్వదేశీ ఉత్పత్తుల వాడకం: దిగుమతులపై ఆధారపడటం తగ్గించి మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలి.
6.  వంట నూనెల పొదుపు:  విదేశాల నుండి దిగుమతి చేసుకునే వంట నూనెల వాడకాన్ని తగ్గించాలి.
7.  విదేశీ పర్యటనల నియంత్రణ:  కనీసం ఏడాది పాటు విదేశీ విహారయాత్రలను వాయిదా వేసుకోవాలి.

 

 పారిశ్రామికవేత్తలకు పిలుపు 

పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి ఈ సంస్కరణలను కేవలం ప్రధాని బాధ్యతగా మాత్రమే చూడకండి. ఇది మన దేశం పట్ల మనకున్న ధర్మం. భారత్ ఒక తిరుగులేని శక్తిగా ప్రపంచ వేదికపై ఎదగాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు అవసరం  అని చంద్రబాబు అన్నారు. సవాళ్లు ఎప్పుడూ కొత్త అవకాశాలను తీసుకొస్తాయని, ప్రస్తుత కష్టాలను దాటుకుని భారతదేశం మరింత శక్తివంతంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ఇదే సమయంలో పారిశ్రామికవేత్తల ముందు తన విజన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలబెడతామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తామని, అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
అమిత్ షా, సి.ఆర్. పాటిల్‌తో కీలక చర్చలు 

అంతకు ముందు  రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి  అమిత్ షా తో భేటీ అయిన ఆయన, విభజన హామీల అమలు మరియు పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ ను కలిసి పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు , రెండో దశ నిధుల గురించి విజ్ఞప్తి చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని, దీనికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.  ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నీతి ఆయోగ్ ప్రతినిధులు,  ప్రపంచ బ్యాంకు అధికారులతో కూడా భేటీ అయ్యారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిర్మల్ జిల్లాలో అటవీ అధికారులు. గిరిజనుల మధ్య ఉద్రిక్తత 
నిర్మల్ జిల్లాలో అటవీ అధికారులు. గిరిజనుల మధ్య ఉద్రిక్తత 
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్
SUV కొనాలని ఆలోచిస్తున్నారా? త్వరలో మార్కెట్లోకి రానున్న 6 పవర్‌ఫుల్ వెహికల్స్
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
WhatsApp కాకుండా Telegram App మీద నిషేధం ఎందుకు? ఇది ఎలా పనిచేస్తుంది ?
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
Tamil Nadu Crop Loan Waiver 2026: తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం- రైతుల రుణమాఫీ రూ.75,000కు పెంపు
HYDERABAD METRO - THE ISSUE and THE STATUS | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
HYDERABAD METRO | హైదరాబాద్ మెట్రోకు ఏమైంది? రూ.13,600 కోట్ల అప్పు, ఫేజ్ - 2 ప్రారంభానికి అడ్డేంటి ??
Embed widget