అన్వేషించండి

APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్- విమాన ప్రయాణాల తరహాలోనే టికెట్ విధానం

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మల్టీ సిటీ టికెటింగ్ విధానాన్ని అమల్లోకి తేబోతున్నట్లు ప్రకటించింది. 

APSRTC News: విమాన ప్రయాణాల తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లోనూ మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టబోతున్నట్లు వెల్లడించింది. ఒక పట్టణం లేదా నగరం నుంచి మరో పట్టణం, నగరానికి నేరుగా బస్సు సౌకర్యం లేనప్పుడు బ్రేక్ జర్నీ విధానంలో ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తిరుపతి నుంచి భద్రాచలం వెళ్లేందుకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తిరుపతి నుంచి విజయవాడకు, అక్కడి నుంచి భద్రాచలానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు కూడా బస్ రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. బ్రేక్ జర్నీ సమయం కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 22 గంటల వరకు ఉండొచ్చు. మొదటి దశలో రాష్ట్రంలో 137 పట్టణాలు, నగరాల నుంచి ఈ మల్టీ టికెటింగ్ సదుపాయాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత దశల్లో మరిన్ని పట్టణాలకు ఈ సౌలభ్యాన్ని విస్తరించనుంది. 

ఇటీవలే 12 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఏపీఎస్ఆర్టీసీ

ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా 12 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కడప నుంచి తిరుమల మార్గంలో నడపబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం రోజు కడప డిపోలో ఈ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 12 బస్సులను గాను 6 బస్సులు నాన్ స్టాప్ గా నడవబోతున్నాయి. మరో ఆరు బస్సులు అవసరాన్ని బట్టి తిరుగుతాయి. తెల్లవారు జాము 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కడప నుంచి తిరుమలకు వెళ్లే పెద్దలకు అయితే రూ.340, పిల్లకు అయితే రూ.260 చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ సందర్భంగానే ఛైర్మన్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ... అన్ని డిపోల్లో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఇప్పటికే తిరుమల - తిరుపతి మధ్య 50 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు - తిరుమల మధ్య 14, తిరుపతి - మదనపల్లె మధ్య 12, తిరుపతి - నెల్లూరు మధ్య 12 బస్సులు నడపనున్నట్లు మల్లికార్జున్ రెడ్డి వివరించారు. 

గతేడాది అక్టోబర్ నుంచి బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్స్

నోట్ల రద్దు, కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో డిజిటల్ పేమెంట్స్ వాడకం పెరిగింది. క్యాష్ లెస్ పేమెంట్స్ వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆన్ లైన్ పేమెంట్స్ అమల్లోకి రావడంతో ఆ దిశగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు ప్రయాణాల్లో నగదు, చిల్లర సమస్యలను పరిష్కరించేందుకు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ పేరిట డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ పేమెంట్స్ ద్వారా బస్సు టికెట్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Embed widget