అన్వేషించండి

Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు రహిత చెల్లింపు విధానాన్ని మరింత విస్తరించనున్నట్టు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం - టీటీడీ రోజుకో టాపిక్ తో వార్తల్లో నిలుస్తోంది. త్వరలో అన్ని సేవలను నగదు రహిత చెల్లింపు విధానాన్ని తీసుకురానున్నట్టు టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం కియోస్క్ మిషన్స్ ఉపయోగిస్తామన్నారు. జనవరి 2025లో ప్రారంభం కానున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లపై ఇటీవలే సమీక్ష నిర్వహించిన టీటీడీ.. టోకెన్లు, టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నామన్నారు.

కియోస్క్ మిషన్స్ తో నగద రహిత చెల్లింపులు

టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇవ్వదలచిన భక్తుల కోసం సులభంగా విరాళం ఇచ్చేందుకు వీలుగా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు (సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) ఏర్పాటు చేసిన విషయం విధితమే. తాజాగా పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ప్రారంభించారు. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశముంది. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉందన్న బీఆర్ నాయుడు.. త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారానే నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడించారు. ఈ మిషన్స్ ద్వారా ఇప్పటివరకు అన్న ప్రసాదం ట్రస్టుకు 50రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అందిందని బీఆర్ నాయుడు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇకపోతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా ఈ మిషన్లు ప్రారంభించారు. ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15రోజుల్లో రూ.5లక్షలు విరాళంగా అందింది.

దర్శనానికి ప్రజాప్రతినిధుల లేఖలు

ఇటీవల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. వారానికి 2రోజులు మాత్రమే అవకాశం కల్పించకుండా.. ఈ వ్యవధిని పెంచాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలను సమానం చూడాలన్నారు. 2 రోజులే కాకుండా వారం రోజులకు పెంచాలని చెప్పారు.

వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాట్లు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఈవో జే శ్యామలరావు. ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుందని.. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం'అని వెల్లడించారు.

Also Read : TTD News: శ్రీవారి హుండీల్లో వేసిన సొమ్మునూ నొక్కేస్తారా ? ఈ స్కాంపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget