అన్వేషించండి

అయోధ్య ఉత్సవ సమయంలో ముస్లింలు బయటకు రాకండి - అసోం నేత సంచలన వ్యాఖ్యలు

Ram Mandir inauguration: అయోధ్య ఉత్సవ సమయంలో ముస్లింలెవరూ బయటకు రావద్దని అసోం నేత అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ram Mandir Opening:


రైళ్లలో ప్రయాణించకండి: అజ్మల్ 

ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే  All India United Democratic Front (AIUDF) చీఫ్ బదరుద్దీన్ అజ్మల్ (Badaruddin Ajmal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల రోజుల పాటు ముస్లింలు ఎవరూ రైళ్లలో ప్రయాణించొద్దని పిలుపునిచ్చారు. ముస్లింలపై దాడులు జరిగే ప్రమాదముందని  హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రైలు ప్రయాణాన్ని మానుకోవడమే మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమానికి కనీసం 60 వేల మంది తరలి వస్తారని అంచనా. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసోంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. జనవరి 20-25 వరకూ ముస్లింలు అంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 

"వాళ్లు (బీజేపీని ఉద్దేశిస్తూ) స్పెషల్ ట్రైన్స్‌ బుక్ చేసుకున్నారు. బస్సులూ బుక్ అయ్యాయి. రామ మందిర ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తుల్ని తరలిస్తున్నారు. జనవరి 20-25 వరకూ ముస్లింలు రైళ్లు, బస్‌లలో ప్రయాణించకపోవడమే మంచిది"

- బదరుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్

బీజేపీపై ఫైర్..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అసోంలోని 14 సీట్లలో మూడు చోట్ల పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది AIUDF.ఇప్పటికే ప్రచారమూ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు అజ్మల్. ఇస్లాం మతాచారాలను బీజేపీ ఎప్పుడూ పట్టించుకోదని, ఆ పార్టీ ముస్లింల వ్యతిరేకి అని మండి పడ్డారు. ట్రిపుల్ తలాక్‌ని అందుకే తొలగించారని అసహనం వ్యక్తం చేశారు. 

"మన ఆచారాలన్నా, సంప్రదాయాన్నా వాళ్లకు చిన్న చూపు. ముస్లింల మహిళల గౌరవాన్ని పట్టించుకోవడం లేదు. ఖురాన్‌ ఆధారంగానే మనకు చట్టాలు ఏర్పడ్డాయి. కానీ బీజేపీ ఇందులోనూ జోక్యం చేసుకుంటోంది"

- బదరుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్

 భిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందింది. కాంగ్రెస్ సహా మరి కొన్ని పార్టీల్లోని కీలక నేతలకూ ఆహ్వానం పంపింది ప్రభుత్వం. ఆ రోజు భక్తులందరూ రావడానికి అవకాశం ఉండదని అందుకే రాముడిపై భక్తి చాటుకునేందుకు ఇంట్లోనే Shri Ram Jyoti వెలిగించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఈ ఉత్సవం పూర్తయ్యాక అందరూ వచ్చి అయోధ్య రాముడిని దర్శించుకోవాలని సూచించారు. 

Also Read: బీచ్‌ టూరిజంలో భారత్‌ మాతో పోటీ పడలేదు, మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్స్ అక్కసు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget