అన్వేషించండి

ABP Southern Rising Summit 2024 : డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం అనేది ప్రాంతీయ పార్టీల వాదన - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో తేల్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్

ABP Southern Rising Summit: దక్షిణాదికి డీమిలేటేషన్‌లో అన్యాయం జరగదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక్క జనాభా ప్రాతిపదకినే కాదని అనేక అంశాల ఆధారంగా డీలిమిటేషన్ జరుగుతుందన్నారు.

ABP Southern Rising Summit 2024 Raghunandan Madhuyaski: నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి సీట్ల పరంగా అన్యాయం జరుగుతుందని విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తోసి పుచ్చారు. ఇదంతా ప్రాంతీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంగానే స్పష్టం చేశారు. డీ లిమిటేషన్ అనేది 2026లో రాజ్యాంగపరంగా తప్పనిసరిగా జరగాల్సిన ప్రక్రియ అని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఏబీపీ నెట్‌వర్క్ హైదరాబాద్ లో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత మధుయాష్కీ బైపోలార్, మల్టీపోలార్ రాజకీయ అంశాలపై జరిగిన ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. 

జనాభా ఒక్కటే నియోజకవర్గాల  పునర్విభజనకు ప్రాతిపదిక కాదు : రఘునందన్ 

నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని కానీ పునర్విభజనకు అనేక అంశాలు దోహదం చేస్తాయన్నారు. సామాజిక, రాజకీయ , ఆర్థిక , డెమెగ్రాఫిక్ స్థితిగతులన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాతనే డీలిమిటేషన్ జరుగుతందన్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి రఘునందన్ రావు ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ జనాభా ఉన్నప్పటికీ అక్కడ లోక్ సభ సీట్లు ప్రాధాన్యత స్థాయిలో ఉంటాయని గుర్తు చేశారు. అలాగే దక్షిణాదిలో కేవలం జనాభా ప్రాతిపదికనే తీసుకోరని స్పష్టం చేశారు.

గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్, అతిపెద్ద మహాత్ముడి విగ్రహం ఏర్పాటు - రేవంత్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాగంపరంగా అవసరం : ముధుయాష్కీ 

ఇదే అంశంపై మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కూడా దక్షిణాదికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని వాదించలేదు. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని క్లారిఫై చేయల్సి ఉందన్నారు. అదే సమయంలో నియోజకర్గాల పునర్విభజన అనేది మాత్రం ఖచ్చితంగా చేసి తీరాల్సిందేనన్నారు. దేశంలో అతి పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరిలో 32 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారని.. ఒక్క ఎల్పీనగర్‌లోనే ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. ఇలా ఇరువురు నేతలు సున్నితమైన అంశంపై తమ అభిప్రాయాలను అటూ ఇటూ కాకుండా స్పష్టంగా వ్యక్తం చేశారు. 

Also Read: Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సంకీర్ణ ప్రభుత్వాలు మంచివే కానీ.. !

సంకీర్ణ ప్రభుత్వాలపై భిన్నమైన వాదన వినిపించారు. రెండు సార్లు యూపీఎ హయంలో సంకీర్ణ ప్రభుత్వాలు అద్భుతంగా నడిచాయని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గుర్తు చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో  ప్రాంతీయ  పార్టీలు బలంగా ఉన్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వంలో నియంత తరహా నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంకీర్ణ రాజకీయాల విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు కానీ.. ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అటల్ బీహారీ వాజ్ పేయి హయాంలో సంకీర్ణ సర్కార్ విజయవంతంగా నడిచిందన్నారు. 

ఈ ప్యానల్ డిబేట్‌లో అటు రఘునందన్ రావు, ఇటు మధుయాష్కీ ఇద్దరు అనేక అంశాలపై తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెలిబుచ్చారు.  పూర్తి డిబేట్‌ను ఈ లింక్‌లో చూడవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget