అన్వేషించండి

Delhi Tension : బలైన మరో "బాల నిర్భయ" మళ్లీ ఢిల్లీ రాజకీయ రణరంగం..!

ఢిల్లీలో బాలికపై దుండగులు అత్యాచారం చేసి చంపేశారు. న్యాయం కోసం రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి.

దేశ రాజధానిలో బాలికలకు.. మహిళలకు భద్రతే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ దేశాన్ని ఎంతగా కదిలించిందో ఇంకా కళ్ల ముందు ఉంది. ఇప్పుడు కొత్తగా "బాల నిర్భయ" ఉదంతం వెలుగు చూసింది. ఆ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన.. ప్రజల్లో చర్చనీయాంశవుతోంది. రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఆగస్టు 1న నైరుతి ఢిల్లీలో తొమ్మిదేళ్ల మైనర్‌ బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారం, హత్య చేశారు. అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేశారు.  ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనకు దిగారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు.  

బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు సహకరించిన పూజారితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్‌ అధికారులు ఆధారాలు సేకరించారు. హత్యాచారం విషయంపై పోలీసులు ఆలస్యంగా స్పందించడంతో... ఆగస్టు 4న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా 48 గంటల్లో దీనిపై నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది.  

ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయడానికి క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ సహా అనేక మంది నేతలు పరామర్శించారు. బీజేపీ మాత్రం ఈ ఘటనను.. రాజకీయంగా వాడుకుంటున్నారని .. విపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు. వారు సరిగ్గా పని చేయకపోతే.. ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ బాల నిర్భయ ఉదంతం.. దేశంలో మహిళలకు.. బాలికల రక్షణపై ఎన్నో సందేహాలు లేవనెత్తుతోంది. 

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తోంది.  బాధిత కుటుంబం దళిత కుటుంబం కావడంతో.. మరింతగా రాజకీయంగా ఫోకస్ వస్తోంది. దళితులకు రక్షణ లేకుండా పోతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ కుమార్తెలకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే పాలకులు ఎవరు ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. వారికి రక్షణ మాత్రం కరవైందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
Champion Box Office Collection Day 2: 'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Embed widget