అన్వేషించండి

Morocco Earthquake: మొరాకోలో భారీ భూకంపం, 820 మందికి చేరిన మృతులు

Morocco Earthquake: మొరాకోలో సంభవించిన భూకంపం విషాదాన్ని నింపింది. సుమారు 820 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రాథమిక అంచనాలలో వెల్లడించారు.

మొరాకోలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. సుమారు 820 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రాథమిక అంచనాలలో వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు తెలిపారు. భూమి తీవ్రంగా కపించడంతో ఇల్లు, కట్టడాలు కూలిపోయి పరిస్థితి భయానకంగా మారిందని స్థానికులు చెప్తున్నారు.

ప్రస్తుత నివేదికల ప్రకారం.. అల్‌ హావోజ్‌, మరాకేశ్‌, ఔర్జాజేట్‌, అజిలాల్‌, చిచౌవా, టరౌడెంట్‌ ప్రావిన్సులు, మున్సిపాలిటీలలో 820 మంది మరణించారని, మరో 650 మంది గాయపడ్డారని మొరాకో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మరాకేశ్‌కు నైరుతి దిశలో 71 కిలోమీటర్ల దూరంలో దాదాపు 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

మరాకేశ్‌లో ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయని స్థానిక మీడియా వెల్లడించింది. మరణించిన వారు, గాయపడిన వారితో అక్కడి పరిస్థితులు దయనీయంగా ఉన్నట్లు పేర్కొంది. శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం సహాయకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

భూ ప్రకంపనలు చాలా దారుణంగా వచ్చాయని, తాము చాలా భయపడ్డామని స్థానిక వ్యక్తి ఒకరు మీడియాకు తెలిపారు. భవనాలు కదులుతుండడం తాను చూశానని, ప్రజలంతా బయటకు పరుగులు పెట్టి రోడ్లపైకి వచ్చారని, అంతా భయంతో వణికిపోతున్నారని వెల్లడించారు. చిన్న పిల్లలు ఏడుస్తున్నారని, వారి తల్లిదండ్రులు కూడా భయంతో వణికిపోతూ కనిపించారని చెప్పారు. పది నిమిషాల పాటు కరెంటు, టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ కట్‌ అయ్యాయని, తర్వాత తిరిగి వచ్చాయని, అందరము బయటే ఉన్నామని తెలిపారు.

తీర ప్రాంత నగరాలైనన రబాత్‌, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో కూడా భూకంపం సంభవించింది. అయితే అంత తీవ్ర స్థాయిలో కాదు. తమ దగ్గర అంత నష్టం జరగలేదని, అందరూ అరుపులు కేకల పెట్టడం తాము చూశామని మరాకేశ్‌కు పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సౌయిరా నివాసి మీడియాకు తెలిపారు.  ప్రజలంతా రాత్రి బయటే ఉన్నారని ఇళ్లలోకి వెళ్లలేదని వెల్లడించారు. భూకంపం వచ్చినప్పుడు తాను డ్రైవింగ్ లో ఉన్నానని, వెంటనే వాహనం ఆపేశానని, పరిస్థితి తీవ్రత అర్థమయ్యిందని మరో వ్యక్తి తెలిపారు. నది ఒడ్డు చీలిపోవడం చూశానని చెప్పారు.

అమెరికా జియోలాజికల్‌ సర్వేకు చెందిన పేజర్‌ సిస్టమ్‌ భూకంప ప్రభావంపై ప్రాథమిక అంచనాలు చేసింది. ఆర్థికంగా నష్టం వాటిల్లడంపై ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది. పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరిగినట్లు తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా పెద్ద భవనాల్లో ఉన్నారని, భూకంపానికి తీవ్ర ప్రభావితమయ్యేలా భవనాలు ఉన్నాయని యూఎస్‌జీఎస్ పేర్కొంది. దేశ చరిత్రలో ఇదే భారీ భూకంపం అని మొరాక్‌ మీడియా చెప్తోంది.

2004 లో మొరాకో ఈశాన్య భాగంలోని అల్‌ హొసీమా పట్టణంలో సంభవించిన భూకంపంలో 628 మంది చనిపోగా, 926 మంది గాయపడ్డారు. 1980లో మొరాకో పక్కనే ఉన్న అల్జీరియాలో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.3 మ్యాగ్నిట్యూడ్‌ గా నమోదైంది. ఈ విపత్తులో 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3 లక్షల మంది ఇళ్లు లేని వారుగా మిగిలిపోయారు. పెద్ద మొత్తంలో ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget