By: ABP Desam | Updated at : 28 Mar 2022 10:20 AM (IST)
Edited By: harithac
(Image credit: Pexels)
వేసవి తాపం మొదలైంది. గంట బయటికెళ్లొస్తేనే ఆ ఎండకి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికీ మరీ ఇబ్బందిగా ఉంటుంది.వీటిలో వంశపారంపర్యంగా చిన్న వయసులోనే వచ్చేది టైప్ 1 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ మాత్రం వారసత్వంగానే కాదు, చెడు జీవన విధానం వల్ల కూడా వస్తుంది. మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముందుగా మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంది. ఆహారాన్ని కూడా సీజన్కు తగ్గట్టు తినాలి. పండ్ల విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి డయాబెటిక్ రోగుల్లో. వేసవిలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే.
అరటి పండు
మధుమేహులు అరటిపండ్లు తినాలంటే భయపడుతుంటారు. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. రోజుకో పండు తినవచ్చు. దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగిపోవు. కాకపోతే బాగా పండిన పండును తింటే కాస్త సమస్య రావచ్చు. ఎందుకంటే వాటిలోనే చక్కెర అధికంగా ఉంటుంది. బాగా పండిన రెండు అరటిపండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ పలకబారినవి తింటే పెద్దగా సమస్య రాదు. అరటిపండులో ఉండే పోషకాలు కూడా షుగర్ పేషెంట్లకు అవసరమే. కాబట్టి రోజుకొకటి తినవచ్చు.
ద్రాక్షలు
తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష రెండూ ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఓ పది ద్రాక్ష పండ్లు తింటే చాలా మంచిది. షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే.
దానిమ్మ
దానిమ్మ పండ్లు పిల్లలు, పెద్దలు అందరికీ చాలా అవసరమైనవి. రక్త హీనత సమస్య దరి చేరకుండా కాపాడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో చేరే ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి ఇవి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేసే పండు దానిమ్మ. రోజుకో దానిమ్మ పండు తింటే ఎంతో ఆరోగ్యం.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు దిగుమతి చేసుకుని అమ్ముతారు కాబట్టి అన్ని కాలాల్లోనూ సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. విటమిన్ సి పుష్కలంగా లభించే పండ్లు ఇవి. రోగనిరోధక శక్తి కోసం వీటిని తినడం చాలా అవసరం. రోజుకు అయిదు పండ్ల వరకు తినవచ్చు. ఇవి తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి కచ్చితంగా మధుమేహులు వీటిని తినాలి.
నారింజ
మధుమేహ రోగులకు నారింజ పండ్లు స్నేహితులనే చెప్పుకోవాలి. ఎన్ని తిన్నా ఆరోగ్యమే. అంతేకాదు షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే సెలీనియం డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. నారింజను రోజుకు రెండు తింటే చాలా మంచిది.
Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు
Diabetes: డయాబెటిస్ ఉన్న వారు మద్యం తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?
Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి
Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!
Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి
Stalin Letter To Jagan : ఏపీ - తమిళనాడు మధ్య జల జగడం ! రెండు ప్రాజెక్టుల్ని నిలిపివేయాలని జగన్కు స్టాలిన్ లేఖ !
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
iPhone 14: ఐఫోన్ 14 విషయంలో అవి రూమర్లే - వెలుగులోకి కొత్త వివరాలు!