అన్వేషించండి

Millionaires Village: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే

ఈ ఊరు ఒకప్పుడు పేద గ్రామం. ఇప్పుడు మిలియనీర్ల విలేజ్.

ఒక గ్రామంలో ధనిక కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ ఈ ఊరిలో మాత్రం పేదకుటుంబాలను అలా లెక్కపెట్టాలి. ధనిక కుటుంబాలను లెక్కపెట్టాలంటే చేతి వేళ్లు, కాలి వేళ్లు కూడా సరిపోవు. ఎందుకంటే ఆ గ్రామంలో 95 శాతం మంది మిలియనీర్లే. అందుకే ఈ గ్రామాన్ని మిలియనీర్ల గ్రామం అని పిలుస్తారు. ఇది మహారాష్ట్రాలోని హివ్రే బజార్. ఒకప్పుడు ఇక్కడ కరువు తాండవిచ్చేది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఎంతో మంది జనాలు వలస వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు ఈ గ్రామం గురించి ప్రపంచానికి చెప్పేందుకు మీడియా వాళ్లు వస్తూ పోతూ ఉంటారు. ఈ ఊరి పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎన్నో కథనాలు వస్తాయి. ఈ ఊరిని ప్రాజెక్టు వర్క్‌గా ఎంచుకుని ఎంతో మంది కథనాలు కూడా రాశారు. ప్రస్తుతం ఈ ఊరిలో మూడు మాత్రమే పేద కుటుంబాలు ఉన్నాయి. మిగతా 252 కుటుంబాలు వాళ్లు ధనవంతులే. 

 ఒకప్పుడు ఇలా...
1972... హివ్రే బజార్ గ్రామం చాలా దారుణ పరిస్థితిలో ఉండేది. ఆకలి కేకలు, దాహపు గొంతులతో  అల్లాడిపోయేది. పంటలు పండేవి కాదు. తిండి లేక జనాలు సిటీకి వలసవెళ్లి పోయేవారు. 1980 కన్నా పరిస్థితి చేయి దాటి పోయింది. దాదాపు 90 శాతం ఊరు ఖాళీ అయిపోయింది. ఒక గ్రామం చరిత్రలో కలిసిపోయేందుకు ఒక అడుగు దూరంగా మాత్రమే ఉంది. అప్పుడే అద్భుతం జరిగింది. 

ఆ ఒక్కడు
ఆ ఊరిలో పీజీ వరకు చదువుకున్న వ్యక్తి పొపట్రావు పవార్. సిటీలో చదువుకుని వచ్చాడు. తన కళ్ల ముందే గ్రామం నాశనం కావడం చూడలేకపోయాడు. సర్పంచిగా పోటీ చేశాడు. నిజానికి పవార్‌కు రాజకీయాలు ఆసక్తి లేదు. కానీ చదువుకున్న నువ్వు మాత్రమే గ్రామాన్ని రక్షించగలవు అంటూ ఒప్పించారు. గెలిచాడు పవార్. చదువుకున్న, తెలివైన పిలగాడు ఊరి పరిస్థితి  అర్థం చేసుకున్నాడు. గ్రామం నాశనం కావడానికి మూల కారణాలు వెతికాడు. అవి సారా దుకాణాలు. ఆ చిన్న గ్రామంలో 22 సారా దుకాణాలున్నాయి. వాటి వల్లే తాగి తాగి ఎంతో మంది చనిపోయారు, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. చివరికి గ్రామంలో అందరూ పనుల బయటికి వెళ్లే పరిస్థితి దాపురించింది. అలాగే చెరువులు ఎండిపోయి, చుక్క నీరులేని పరిస్థితి. వెళ్లిన జనం వెనక్కి రావాలంటే నీరు పుష్కలంగా ఉండాలి. ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నాక ప్రణాళికలు రూపొందించాడు పవార్. Millionaires Village: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే

నీటిని ఒడిసిపట్టి
గ్రామంలోని చుక్క నీటిని కూడా వదలకుండా ఒడిసిపట్టే ఏర్పాట్లు చేశాడు. ఊర్లో పల్లపు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, చెరువు తవ్వించాడు. దీంతో వానలు పడ్డాక భూగర్భజలాలు పెరిగాయి. దాదాపు ఆ చిన్న గ్రామంలో 52 ఇంకులు గుంతలు తవ్వించాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చుట్టూ తిరిగి కాలువలు ఉన్న చోట చెక్ డ్యాములు కట్టించాడు. దీంతో నీరు నిల్వలు పెరిగాయి. బయటికి వెళ్లిన ప్రజలు తిరిగి ఊళ్లకు వచ్చాడు. 70 హెక్టార్లలో పంటలు పండించడం మొదలుపెట్టారు. బోర్లు వేస్తే చాలు కేవలం 40 అడుగుల లోతులోనే నీళ్లు పడేవి. ఇంకేముంది పంటలు విరగకాశాయి. సారాయి దుకాణాలను కూడా మెల్లగా ఖాళీ చేయించారు. Millionaires Village: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే

1995లో ఆ ఊదరిలో 170 కుటుంబాలు ఉండేవి. అందులో 165 కుటుంబాలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నవే. వారందరూ ధనవంతులుగా మారారు.కష్టపడి పంటలు పండిస్తూ తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. ఆ ఊళ్లో తలసరి ఆదాయం ప్రస్తుతం 30,000 రూపాయలు. ఇప్పుడు 255 కుటుంబాలు నివసిస్తుంటే, వాటిలో మూడు కుటుంబాలే పేదవి. మిగతా వాళ్లంతా ధనికులే. ఎక్కువ కార్లున్న గ్రామం కూడా ఇదే. కేవలం వర్షపు నీటిని ఒడిసి పట్టి, వాటితో పంటలు పండిస్తూ ఇలా మిలియనీర్లుగా మారారు వీళ్లంతా. 

జొన్నలు, మొక్కజొన్న, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, సజ్జలు వంటివి పండిస్తారు. ప్రతి రోజూ ఈ గ్రామం నుంచి 4000 లీటర్ల పాలను అమ్ముతారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా గుర్తించింది. 

Also read: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యిని దూరం పెట్టండి

Also read: గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగవచ్చా? తాగడం వల్ల లాభమా, నష్టమా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget