అన్వేషించండి

Sleep Deprivation Effects: రాత్రంతా జాగారం చేస్తున్నారా? జాగ్రత్త - ఆలస్యంగా నిద్రపోతే మీ మెదడులో జరిగేది ఇదే

Late sleeping: చేతిలో ఫోన్ ఉంటే.. నిద్ర రమ్మన్న రాదు. ఒక వేళ వచ్చినా.. మనమే వాయిదా వేస్తుంటాం. బలవంతంగా నిద్రను ఆపేసి మరీ ఫోన్‌ చూసేస్తాం. దానివల్ల మెదడుకు ఏమవుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?

Late Sleeping Side Effects: మన పెద్దలు ఎప్పటి నుంచో సరైన సమయంలో భోజనం చేయాలని, నిద్రించాలని.. అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేవారు, ఆ నియమాలను కచ్చితంగా పాటించేవారు కూడా. ఆయుర్వేద నిపుణులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అల్పాహారాన్ని ముగించాలని, సాయంత్రం చీకటి పడిన వెంటనే భోజనం చేయాలనే నియమాలను తప్పక పాటించాలని చెబుతున్నారు. మన పూర్వికుల ఆరోగ్య రహస్యం కూడా ఇదేనని తెలుపుతున్నారు. అయితే, ఈ రోజుల్లో పని ఒత్తిడి, మొబైల్ వాడకం వల్ల కంటి నిండా నిద్రపోయేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అర్ధరాత్రిళ్లను కూడా పట్టపగలుగా ఫీలవుతూ గడిపేస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోతూ కొత్త రోగాలను తెచ్చుకుంటున్నారు. నిద్రనాణ్యత లోపించడం వల్ల డయాబెటిస్, గుండె సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. 

చాలామంది స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడి గంటల తరబడి నిద్రపోవడం లేదు. అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము వరకు మెలకువగా ఉంటున్నారు. ఇలా మెలకువగా ఉండటం వల్ల మెదడు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుంది. ఫలితంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం మీ రోగ నిరోధక శక్తి పైన కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి రుగ్మతలు సైతం వచ్చేందుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ అవుతాయని, చివరకు అది శరీరంలో అనేక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మెదడులో ఏం జరుగుతుంది?

నిద్రలో మన శరీరానికి పెద్ద పని ఉండదని అనుకుంటాం. కానీ అసలు పని అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మన మెదడు చాలా కష్టపడి పనిచేస్తుంది. మన జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపరిచే పని అప్పుడే అభివృద్ధి చేస్తుంది. కేవలం రాత్రివేళల్లో మాత్రమే మన మెదడు ఈ పనులన్నీ చేస్తుంది. మెలకువ ఉన్నట్లయితే.. అది మనం చెప్పే పని మాత్రమే చేస్తుంది. మన శరీర ఆరోగ్యం, మెమరీ, మానసిక ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచేందుకు చేయాల్సిన పనులు చేయలేదు. మనం నిద్రపోయినప్పుడు మాత్రమే దానికి అవన్నీ సరిచేసేందుకు టైమ్ దొరుకుతుంది. కానీ, మనం నిద్రపోకుండా మెదడుకు ఎక్కువ పని చెబుతున్నాం. దాని పని అది చేసుకోడానికి తక్కువ సమయం ఇస్తున్నాం. ఫలితంగా అనేక రోగాలకు ఆహ్వానం పలుకుతున్నాం.  

స్లీప్ స్పెషలిస్ట్‌ల సూచనల ప్రకారం.. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. ఇందుకు మీ వర్క్ షెడ్యూల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు సరైన సమయానికి నిద్రపోయేందుకు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. నిద్రలేమి వల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులు నిద్ర లేకపోవడం వల్ల తమ కెరీర్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా సరైన సమయానికి నిద్రపోయి ఆరోగ్యంగా ఉండండి. నిద్రపోకుండా రాత్రిళ్లు జాగారం చేసే మీ స్నేహితులకు ఈ విషయాన్ని షేర్ చేయండి.

Also Read : చలికాలంలో సన్​షైన్​ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger and Leopard Deaths: వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
వేర్వేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృతి.. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Embed widget