అన్వేషించండి

Woman's Health: ‘పోషకాహార మాసం’ అంటే ఏమిటీ? ఎందుకు నిర్వహిస్తున్నారు? మహిళలకు కలిగే ప్రయోజనాలేమిటీ?

భారతీయ గృహిణిలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించరు. అందుకే వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ పోషణ్ మాసం తీసుకొచ్చారు.

మహిళలు ఇంటి పనుల్లో పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఇంట్లో భర్త, పిల్లలకి మాత్రం ఏదైనా అయ్యిందంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా నిద్రాహారాలు మానుకుని వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. అందుకే స్త్రీ ని భూదేవితో పోలుస్తారు. భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం స్త్రీకి మాత్రమే సొంతం. వారి ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ నెలని 'పోషణ మాహ్' లేదా 'పోషకాహార మాసం'గా పాటిస్తుంది. 2018 మార్చి 8న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోషణ్ అభియాన్ ని ప్రారంభించారు. దీన్నే జాతీయ పోషకాహార మిషన్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం మహిళా ఆరోగ్యం, శిశు, విద్యపై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ పోషకాహార మాసం 2022 థీమ్ ‘మహిళా ఔర్ స్వస్త్య’, ‘బచా ఔర్ శిక్ష’.

వయస్సు పెరిగే కొద్ది స్త్రీల ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కానీ భారతీయ మహిళలు మాత్రం తమ ఆరోగ్యం గురించి చాలా తక్కువ శ్రద్ధ చూపిస్తారు. తల్లిగా, భార్యగా, కూతురుగా ఎప్పుడు ఇతరుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారే తప్ప తమ స్వంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. 40 ఏళ్ళకు చేరుకున్న తర్వాత మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు బయటపడతాయి. వృద్ధాప్యం శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. 10  మందిలో 7మంది మహిళలు తల నొప్పి, నిద్ర లేమి, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటు తమ వద్దకి వస్తున్నారని అపోలో హాస్పిటల్ కి చెందిన డైటీషియన్ ఒకరు చెప్పుకొచ్చారు.

నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో వచ్చే సమస్యలు

మహిళలు 40 ఏళ్లు దాటిన తర్వాత పెరిమెనోపాజ్ దశకి చేరుకుంటారు. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ స్థాయిలో భారీ మార్పు ఉంటుంది. దాని వల్ల ఆందోళన, నిరాశ వంటి సమస్యలకు లోనవుతారు. 40 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు అండాశయం, ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు గురవుతారు. స్త్రీలకు స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. మహిళలు ఈ వయస్సులో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ పరిస్థితికి కూడా గురవుతారు. ఇవే కాకుండా మూత్రాశయంలో సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్స్, ఆస్టియో ఆర్థరైటిస్, అధిక రక్తపోటు సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.

అధిగమించడం ఎలా

మనం తినే ఆహరం సంపూర్ణంగా ఉండాలి. అన్నీ పోషకాలు అందె విధంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇవే కాదు శారీరక శ్రమ, వ్యాయామం అవసరం చాలా ఉంది. ఎందుకంటే మంది ప్రోటీన్స్ తో పాటు వ్యాయామం కూడా కండరాలను బలోపేతం చెయ్యడానికి సహాయపడుతుంది. అలసటని అధిగమించడంలో సహకరిస్తుంది. మహిళలు పనుల్లో పడి సకాలంలో తినడం మానేస్తారు. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం. శరీరానికి 2200 నుంచి 2500 కేలరీలు అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు శారీరక విధుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆలస్యంగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తే, అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే సమతుల్య, సమయానుకూల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

పోషకాహర మాసం లక్ష్యం

పంచాయతీ స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. "పోషన్ పంచాయతీ కమిటీలు అంగన్‌వాడీ కేంద్రాలు(AWC), గ్రామ ఆరోగ్యం, పోషకాహార దినోత్సవం ఇతర సంబంధిత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సమస్యల పరిష్కారానికి, సేవలను అందించడంలో సహాయపడటానికి క్షేత్ర స్థాయి కార్యకర్తలతో కలిసి పని చేస్తుంది. రక్తహీనత పరీక్షల కోసం ప్రత్యేకంగా AWCలలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు.

గిరిజన ప్రాంతాల్లో తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం సాంప్రదాయ ఆహారాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 'అమ్మా కి రసోయి' అనే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇదే కాకుండా సాంప్రదాయ పోషకమైన వంటకాల ప్రాముఖ్యతని తెలిపేందుకు ‘అమ్మమ్మ వంటగది’ వంటి కార్యకలాపాలను పెంపొందిస్తోంది. 

Also Read: ఈ ‘టీ’లు మిమ్మల్ని బ్యూటీఫుల్‌గా మార్చేస్తాయ్, ట్రై చేసి చూడండి

Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget