అన్వేషించండి

Mobile Addiction in Children : పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ప్రమాదకరం.. నిద్రలేమి, డిప్రెషన్​తో పాటు తీవ్ర నష్టాలు, జాగ్రత్త!

Smartphones Harm Kids : స్మార్ట్​ ఫోన్​ల దుష్ప్రభావాలు అందరికీ తెలుసు. చిన్న వయసులో ఫోన్లు వాడే పిల్లల్లో తీవ్రమైన సమస్యలు వస్తాయంటూ తెలిపింది తాజా అధ్యయనం. మరి ఏ వయసులోపు వారికి ఫోన్ ఇవ్వకూడదంటే..

Smartphones Are Dangerous for Kids : స్మార్ట్‌ఫోన్‌కు బానిస అవ్వడం వల్ల పెద్దలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. క్రమంగా ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. స్మార్ట్​ ఫోన్​కి బానిసైపోతున్న చిన్నారులు ఎందరో. ఇదే గనుక మీ పిల్లలకు ఉంటే.. జాగ్రత్త. ఎందుకంటే అది తీవ్రమైన నష్టాలతో.. మరింత ప్రమాదకరంగా మారుతుంది. తాజా అధ్యయనం ప్రకారం.. పిల్లలకు చిన్న వయస్సులోనే ఫోన్ ఇస్తే.. వారు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పిల్లలలో నిద్ర లేకపోవడం, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయట.

అధ్యయనంలో షాకింగ్ విషయాలు

అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మొబైల్ ఉపయోగించే వ్యసనం ఉంటే.. వారిలో నిద్ర సమస్యలు, బరువు పెరగడం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. అధ్యయనం ప్రకారం.. ఫోన్ కారణంగా పిల్లల దినచర్య దెబ్బతింటుంది. దీనివల్ల ఇతర సమస్యలు మొదలవుతాయి. ఫోన్ ఉన్న పిల్లలు రాత్రిపూట స్క్రోలింగ్ చేస్తూ తక్కువ నిద్రపోతారు. స్క్రీన్ సమయం కారణంగా శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీనితో పాటు సోషల్ మీడియాలోని నెగిటివ్ కంటెంట్ పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుంది. దానిని వారి మనస్సు అర్థం చేసుకోవట్లేదని.. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు. 

అధ్యయనంలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నారని.. కానీ వారు సోషల్ మీడియాలో చూసే కంటెంట్ ఇంపాక్ట్ వారిపై రకారకాలుగా ఉంటుందని తెలిపారు. చిన్న వయస్సులోనే స్మార్ట్‌ఫోన్ ఇస్తే వారికి నైపుణ్యాలు అభివృద్ధి చెందవని తెలిపారు. 

నష్టాలను నివారించే మార్గం ఇదే

భద్రత లేదా ఆన్​లైన్ స్టడీ వంటి ఇతర కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తున్నారు. అలాంటి పేరెంట్స్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారి నుంచి ఫోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ యాప్స్ కంట్రోల్ పేరెంట్స్​ సెట్ చేయాలని.. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో రీచ్ కోసం చాలామంది పేరెంట్స్ తమ పిల్లల ప్రైవసీని సోషల్ మీడియాలో పెడుతున్నారని.. అది ఏమాత్రం మంచిది కాదని.. పిల్లల సేఫ్టీ కూడా దీనిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. పిల్లలకు ఇలా ఐడీలు క్రియేట్ చేయడం వల్ల దానికి వచ్చే నెగిటివ్ కామెంట్స్ వారిపై తెలియకుండానే ప్రభావితం చూపిస్తుంది. 

పిల్లలకు స్క్రీన్ సమయాన్ని సెట్ చేయాలని చెప్తున్నారు.  మొబైల్ గేమ్స్ కంటే.. బయట గేమ్స్ ఆడేలా ప్రోత్సాహించాలి. పిల్లల డిస్టర్బెన్స్ ఉండొద్దని.. వారికి ఫోన్ ఇచ్చేయడం చేయకుండా.. పిల్లలతో కూర్చొని మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి మానసిక పరిస్థితి మెరుగవుతుంది. అలాగే స్టడీపై ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Advertisement

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget