అన్వేషించండి

Kabaddi Player Dies with Dog Bite : కుక్కకాటుతో ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కబడ్డీ ప్లేయర్.. ఆ చిన్న మిస్టేక్ వల్లే

Dog Bite : కుక్కు కాటుతో 22 ఏళ్ల కబడ్డీ ప్లేయర్ రీసెంట్​గా ప్రాణాలు కోల్పోయాడు. చిన్న మిస్టేక్ చేయడం వల్లే చనిపోయినట్లు తేలింది. అసలు కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం.

Brijesh Solanki Dog Bite Death : తెలిసో తెలియకో చేసే అతి చిన్న మిస్టేక్​ వల్ల ప్రాణాలే పోతాయనే దానికి నిదర్శనం ఈ ఘటన. 2026 ప్రో కబడ్డీ లీగ్​ కోసం సిద్ధమవుతున్న ఓ కబడ్డీ ప్లేయర్ మరణం దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్ర ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం సాధించిన ఓ ఆటగాడు.. ఒక్క చిన్న తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఏమైంది? ఎవరు ఆ కబడ్డీ ప్లేయర్?

ఉత్తరప్రదేశ్​కి చెందిన బ్రిజేష్ సోలంకికి 22 ఏళ్లు. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ప్లేయర్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం కూడా సాధించాడు. ఇతను కొన్ని వారాల క్రితం ఓ కుక్కపిల్లను రెస్క్యూ చేశాడు. ఆ సమయంలో కుక్క కాటుకు గురయ్యాడు. చిన్న గాటే కాదా.. ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్నాడు. కట్ చేస్తే అదే ఆ ప్లేయర్ ప్రాణాన్ని తీసుకుంది. 

కుక్కగాటు తర్వాత బ్రిజేష్ అది పెద్ద హాని చేయదులే అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే యాంటీ రేబిస్ టీకాను తీసుకోవడం మానేశాడు. ఇప్పుడు అదే అతని మరణానికి దారితీసిందని.. రేబిస్ సంబంధిత వైద్యులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే.. ఎవరైనా బాధపడాల్సిందే. 22 ఏళ్ల యువకుడు, ఆటగాడు అలా చనిపోవడం అందరి హృదయాలను కలచి వేస్తుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian Right Wing Community (@indianrightwingcommunity)

 

కుక్కగాటు ఎంత ప్రమాదమంటే.. 

ఎడిన్​బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం రేబిస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అంటువ్యాధులకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల్లో రేబిస్ 10వ స్థానంలో ఉందట. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల నుంచి 60 వేల మంది రేబిస్ కారణంగా మరణిస్తున్నారని.. తాజా అధ్యయనం నివేదించింది. 

ఇండియాలో రేబిస్ వ్యాప్తి

ఇండియాలో ప్రతి సంవత్సరం రేబిస్ కారణంగా సంభవించే మరణాలు 36 శాతంగా ఉన్నాయి. వీటిలో 95 నుంచి 97 శాతం కుక్కగాటు వల్లే జరుగుతున్నాయట. “భారతదేశంలో ఏటా సుమారు 17.4 మిలియన్ల కుక్క కాటుల కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల సంవత్సరానికి 18,000–20,000 మందికి రేబిస్ నమోదవుతుంది” అని ఆ అధ్యయనం చెబుతోంది. పౌర, వైద్య, ప్రభుత్వం నివారణ చర్యలను అమలు చేయడంలో జోక్యం చేసుకోకపోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో భారతదేశం అతిపెద్ద వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.

కాబ్టటి చిన్న గాటే కదా అని కుక్క కాటును విస్మరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యసహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే కేవలం కుక్కనే కాదు.. ఇతర జంతువుల వల్ల ఎలాంటి కాటు లేదా గాటు వంటివి పడినా.. మందుగా వైద్యుల సలహాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. అలాగే ఈ తరహా కేసులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వాటిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget