అన్వేషించండి

Diabetes: భోజనం చేశాక ఇలా చేస్తే చాలు, మధుమేహం అదుపులో ఉండడం ఖాయం

భోజనం చేశాక నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలిలో నడకది ప్రధాన పాత్ర. వ్యాయామం చేయలేని వారికి నడక ఎంతో మేలు చేస్తుంది. చాలామంది ఉదయాన నడిచేందుకు ఇష్టపడతారు. రోజు గంట నడిస్తే చాలు ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతారు వైద్యులు. అయితే భోజనం చేశాక ఒక పది నిమిషాలు నడపడం వల్ల మధుమేహం అదుపులో ఉంచుకోవచ్చని, ఇంకా అనేక ఆరోగ్యాలు కలుగుతాయని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

భోజనం చేశాక బద్ధకంగా అనిపిస్తుంది. కాసేపు నిద్ర పోవాలనిపిస్తుంది. చాలామంది మధ్యాహ్న భోజనం చేసి ఒక గంట సేపు కునుకేస్తారు. ఇది ఆరోగ్యానికి చెడే చేస్తుంది. భోజనం చేసాక కనీసం 10 నిమిషాలు నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. టైప్2 మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత ఆహారంలో ఉన్న గ్లూకోజు రక్త ప్రవాహంలోకి ఒకేసారి విడుదలవుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో పెరుగుదల ఏర్పడుతుంది. దీనివల్ల మధుమేహం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే భోజనం చేశాక నడవడం వల్ల ఇలా జరిగే అవకాశం తగ్గుతుంది. 

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు 11 నిమిషాలు చురుగ్గా నడిస్తే చాలు. వారానికి 75 నిమిషాల నడక వల్ల ముందస్తు మరణ ప్రమాదాన్ని 23% తగ్గిస్తుందని ఆ అధ్యయనం చెబుతుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17% తగ్గించుకోవచ్చని, క్యాన్సర్ ప్రమాదాన్ని ఏడు శాతం తగ్గించుకోవచ్చని వివరిస్తుంది.

భోజనం తర్వాత పది నిమిషాలు నడవడం వల్ల శరీరంలో సెరటోనిన్ విడుదల అవుతుంది. ఇది మంచి నిద్రకు, ఆకలిని నియంత్రించడానికి, సానుకూల మనస్తత్వాన్ని పెంచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. 

ఎన్నో ప్రయోజనాలు
భోజనం చేశాక పది నిమిషాలు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలా నడిస్తే కీళ్లు బలోపేతం అవుతాయి. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. మానసిక పరిస్థితి బాగుంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది .కండరాలు, ఎముకలు మొదలైనవి బలోపేతం అవుతాయి. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరెటోనిన్, ఎండార్ఫిన్ వంటి సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి. పేగు ఆరోగ్యానికి పోస్ట్ మీల్ వాకింగ్ ఎంతో మంచిది. భోజనం చేశాక ఓ పది నిమిషాలు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్న వారు ఇలా చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. డయాబెటిస్ లేని వారు వాకింగ్ చేస్తే భవిష్యత్తులో ఆ రోగం వచ్చే అవకాశం తగ్గుతుంది. 

Also read: మగవారికి రొమ్ములు పెరిగితే దానికి కారణం ఈ తీవ్రమైన సమస్య కావచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్

వీడియోలు

WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి
Border 2 Advance Booking Report: అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
అడ్వాన్స్ బుకింగ్‌లో 'ధురంధర్'ను బీట్ చేసిన 'బోర్డర్ 2'... భారీ ఓపెనింగ్ మీద కన్నేసిన సన్నీ డియోల్
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Embed widget