అన్వేషించండి

Kidney Disease : కిడ్నీ వ్యాధి లక్షణాలు, సంకేతాలు విస్మరించవద్దు.. మూత్రంలో నురుగు నుంచి శ్వాస ఆడకపోవడం వరకు

Early Kidney Diseases : మూత్రంలో నురుగు, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనా ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇవి నార్మల్ అస్సలు కాదు. కిడ్నీలు హెచ్చరికలు. వీటిని ఎలా గుర్తించి జాగ్రత్త తీసుకోవాలంటే..

Silent Signs of Kidney Disease : మూత్రంలో నురుగు కనిపిస్తే అది సాధారణ విషయం కాకపోవచ్చు కానీ.. మూత్రవిసర్జన తర్వాత నీళ్లు పోస్తే నురుగు దానంతట అదే పోవాలి. అలా పోకుండా నురుగు అలాగే ఉంటే.. అది మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వడానికి (ప్రోటీన్యూరియా) సంకేతం కావచ్చు. అలాగే తగినంత నీరు తాగినా మూత్రం తక్కువగా వస్తుంటే.. కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతున్నాయని అర్థం. పగటిపూట ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం కూడా కిడ్నీ వ్యాధి లక్షణం కావచ్చు. ఇలాంటి సమస్యలని చిన్నవే, నార్మలే అనుకుని పట్టించుకోకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు పెరిగి ప్రాణంతకమవుతాయంటున్నారు నిపుణులు. 

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు లేవడం 

ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ నవీన్ రెడ్డి అవుల ప్రకారం.. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు లేవడం అస్సలు సాధారణం కాదట. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి అంటున్నారు. అదేవిధంగా మూత్రంలో రక్తం రావడం కిడ్నీ స్టోన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్ లేదా మూత్ర మార్గం, కిడ్నీలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.

శరీరం మొత్తం నిరంతరం దురదగా ఉంటే అది యూరిమియాకు సంకేతం కావచ్చు. రక్తంలో యూరియా, ఇతర వ్యర్థ పదార్థాలు పెరిగినప్పుడు యూరిమియా పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి దురదను తేలికగా తీసుకోకూడదు. దీంతో పాటు ఎక్కువ శ్రమ లేకుండా నడిచేటప్పుడు ఆయాసం రావడం లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడటం కూడా కిడ్నీ సమస్యతో ముడిపడి ఉండవచ్చు. శరీరంలో అదనపు నీరు చేరడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చాలాసార్లు తినే ఆహార పదార్థాల రుచి వింతగా లేదా లోహపు రుచిలా అనిపిస్తుంది. లేదంటే నోటి నుంచి నిరంతరం దుర్వాసన రావచ్చు. రుచిలో ఇలాంటి మార్పు కూడా కిడ్నీ వ్యాధికి సంకేతం కావచ్చు. దీనిని తేలికగా తీసుకోకూడదని చెప్తున్నారు నవీన్.

కిడ్నీ వ్యాధులను ఎలా నివారించవచ్చు?

కిడ్నీ వ్యాధులను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చికిత్స, తదుపరి పరిస్థితి రెండింటినీ మెరుగుపరుస్తుంది. శుభవార్త ఏమిటంటే.. కిడ్నీలను కొన్ని సులభమైన పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అవేంటంటే..

  • రక్త పరీక్ష (సీరం క్రియేటినిన్)
  • మూత్ర పరీక్ష (యూరిన్ అనాలిసిస్, ఆల్బుమిన్-టు-క్రియేటినిన్ రేషియో)

కొంతమంది క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. వీరిలో డయాబెటిస్ ఉన్నవారు, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉన్నవారు, లేదా ఎక్కువ కాలం పాటు నొప్పి నివారణ మందులు లేదా కొన్ని ప్రత్యేక మందులను ఎక్కువగా వాడినవారు కచ్చితంగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా టెస్ట్​లు చేయించుకుని.. సమస్యను గుర్తిస్తే.. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget