అన్వేషించండి

Good Health: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు

సుష్టుగా భోజనం చేశాక కొన్ని పనులకు దూరంగా ఉండాలి, లేదంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

కొన్ని చిట్కాలు చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ వాటిని పాటించడం ద్వారా పెద్ద లాభాల్నే పొందచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం అయితేనే దాన్నుంచి మనకు పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ అందేది. జీర్ణం కాలేదో కడుపునొప్పి, మంట ఇలా చాలా సమస్యలు మొదలవుతాయి. భోజనం చేశాక కొన్ని పనులు చేయకుండా ఉంటే ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. 

1. చాలా మంది రాత్రి భోజనం పొట్ట నిండా తిని, భుక్తాయాసంతో వెంటనే నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ రేటు దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా అనిపించడం వంటివి జరగొచ్చు. పడుకున్నప్పుడు జీర్ణ రసాలు అన్నవాహికలోకి జారి గుండెల్లో మంట కలగవచ్చు. కనుక భోజనం తిన్నాక కనీసం ఓ గంట పాటు నిటారుగా కూర్చోండి. దీని వల్ల జీర్ణ రసాలు తమ పని తాము సక్రమంగా చేస్తాయి. 
2. చాలా మందికి ఉండే అలవాటు భోజనం పూర్తయ్యాక పండ్లు తినడం. ఆహారపదార్థాలను బట్టి అవి జీర్ణమయ్యే రేటు ఆధారపడి ఉంటుంది. పండ్లు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. భోజనం చేశాక పండ్లు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పొట్టలో ముందుగా తిన్న అన్నం జీర్ణం అవుతుంటుంది, ఆ తరువాత పండ్లు. ఈ లోపు పండ్లు పులిసిపోవడం ప్రారంభమై గ్యాస్ విడుదలకు కారణం అవుతాయి. కాబట్టి భోజనానికి ముందు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. 
3. కొంతమందికి భోజనం చేశాక టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతినొచ్చు. టీ ఆకుల్లో ఆమ్లం ఉంటుంది, అది ఆహారాన్ని జీర్ణం చేసుకునే శరీర సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. టీలో పాలీఫెనాల్స్, టానిన్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని విడుదలయ్యే ఇనుమును అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇనుము మన దేహానికి ఎంత అవసరమో తెలుసుకదా... అందుకే భోజనం చేశాక టీ తాగక పోవడం చాలా మంచిది. భోజనానికి, టీకి కనీసం రెండు గంటల గ్యాప్ వచ్చేలా చూసుకోండి. 
4. అధికంగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. భోజనం చేసే సమయంలో, ఆ తరువాత నీళ్లు తక్కువగా తాగాలి. ఎక్కవగా తాగితే ఆ నీళ్లు జీర్ణ రసాలను పలుచగా మారుస్తాయి. దీంతో అవి ప్రభావవంతంగా తమ పని తాము చేయలేవు. తద్వారా ఆహారం విచ్చిన్నం అవ్వడానికి సమయం పడుతుంది. అరుగుదల సమస్య రావచ్చు. 
5. టిఫిన్ లేదా భోజనం తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు చాలా మంది. కాని ఇది మీ జీర్ణ క్రియకు ఆటంకం కలిగిస్తుంది. స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ నుంచి రక్తం ఎక్కువ భాగం శరీరం ఉపరితలంలోని చర్మంలోకి, అవయవాల్లోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. 
6. మీరు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహారాన్ని తినకండి. సాధారణ స్థితికి వచ్చాక భోజనం చేయండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు కేంద్రనాడీ వ్యవస్థ (సెంట్రల్ నెర్వ్స్ సిస్టమ్) మీ జీర్ణ వ్యవస్థకు రక్త సరఫరాను సరిగా కానివ్వదు. జీర్ణ కండరాల సంకోచాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు అవసరమైన స్రావాలను తగ్గిస్తుంది. 

ఏం చేయాలి?
భోజనం చేశాక ఏదైనా తాగాలనిపిస్తే అల్లం టీ తాగండి. ఆయుర్వేదం ప్రకారం అల్లంటీ చిన్నపేగుల్లో ఆహారం కదలికను మెరుగుపరుస్తుంది. జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గ్యాస్, కడుపుమంట, తిమ్మిరి రాకుండా నిరోధిస్తుంది. తద్వారా జీర్ణ క్రియ సజావుగా సాగుతుంది. 

Also read: షుగర్ వ్యాధి ఒంట్లో చేరి ఏం చేస్తుందో తెలుసా... జాగ్రత్త పడండి
Also read: మంచి బ్యాక్టిరియాతో మెదడుకు సంబంధం... వాటి కోసం ఏం తినాలంటే...
Also read: పిల్లలకు రోజుకో అరస్పూను నెయ్యి తినిపించండి... మతిమరుపు దరిచేరదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget