అన్వేషించండి

Work From Home: వర్క్ ఫ్రం హోం మీకు ఎంత హాని చేస్తుందో తెలుసా? దీనివల్ల ఆరోగ్యపరంగా అంతా చెడే

వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఎంతోమంది త్వరగా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

కరోనా తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో విపరీత మార్పులు వచ్చాయి. పూర్తిగా  వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కార్యాలయాలు ఉన్నాయి. అలాగే మూడు రోజులు ఆఫీస్‌కు వస్తే, మూడు రోజులు ఇంటి దగ్గర పని చేసే హైబ్రిడ్ మోడల్ కూడా వచ్చాయి. కొత్తల్లో ఉద్యోగులంతా సంతోషించారు. ఇంట్లోనే  హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ దీర్ఘకాలంగా ఇలా వర్క్ ఫ్రం హోం చేసేవారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంటి నుండి పనిచేయడం అనేది ఆరోగ్యం పై ప్రతికూలతనే పెంచుతుంది. 

ఎక్కువమంది ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఒకే భంగిమలో ఉంటారు. అలా  ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటారు. అదే ఆఫీసులో అయితే మధ్య మధ్యలో స్నేహితులతో మాట్లాడడం, వారితో బయటికి టీ తాగడానికి వెళ్లడం, ఇటూ అటూ నడవడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం కదలకుండా ఎక్కువ గంటలసేపు కూర్చుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఎముకలు, కండరాలు, కీళ్ల సంబంధిత సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలానే కొన్నేళ్లపాటు కొనసాగితే కండరాలు, ఎముకలు, కీళ్లు క్షీణిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడం వల్ల విటమిన్ డి కూడా శరీరానికి అందడం లేదు. శరీరంలో విటమిన్ డి ఎప్పుడైతే తగ్గిందో క్యాల్షియం శోషణ కూడా తగ్గిపోతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశం ఉంది. ధూమపానం ఎంత హానికరమో, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని పనిచేసే వర్క్ ఫ్రం హోం పద్ధతి కూడా అంతే హానికరం. ఇలా చేయడం వల్ల వెన్ను కండరాలు, ఎముకలు దెబ్బతింటాయి. ఇలా కొన్ని గంటల పాటు కదలకుండా ఉండడం వల్ల డీప్ వీనస్ థ్రాంబోసిస్ అనే తీవ్రమైన ఆరోగ్య సమస్య రావచ్చు. దీనివల్ల కాళ్లల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ. అలాగే ప్రాణాంతకమైన పల్మనరీ ఎంబోలిజం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఎక్కువ గంటల పాటు కదలకుండా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనివల్ల నడుము వంకరగా మారే అవకాశం ఉంది. కాలక్రమేనా నడుము దిగువ భాగంలో, మధ్య భాగంలో ఉన్న కండరాలు బలహీన పడవచ్చు. దీనివల్ల నడుము నొప్పులు, మెడ నొప్పులు వస్తాయి. కాబట్టి నిశ్చల జీవనశైలిని అలవాటు చేసే వర్క్ ఫ్రం హోం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఏమీ లేదు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారిలో ఒత్తిడి కూడా అధికంగా ఉంటున్నట్టు చెబుతున్నారు పరిశోధనకర్తలు. ఇలా దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనకు గురువుతున్న వారిలో మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది ఎముక ఆరోగ్యాన్ని కూడా పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తనాళాలు పరిమితంగానే రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తాయి. దీనివల్ల కండరాలు, కీళ్లు దెబ్బతింటాయి. కొన్ని అవయవాలకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. పోషకాలు కూడా ఇది మొత్తం మీద శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు గంటలు గంటలు కూర్చోవడం మానేయాలి. రెండు గంటలకు ఒకసారైనా లేచి అటూ ఇటూ పావుగంట సేపు తిరగాలి. ఇలా ఒకే పొజిషన్లో గంటలపాటు కూర్చుంటే హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది.

Also read: ఇంట్లో ఒకే సబ్బును కుటుంబ సభ్యులంతా ఉపయోగించవచ్చా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget