అన్వేషించండి

Indian Book of Records: ఈ సోదరులు 48 గంటల్లో 5000 మొక్కలు నాటారు... ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు

ఆ సోదరులిద్దరికీ మొక్కలు నాటడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 48 గంటల్లో 5వేల మొక్కలు నాటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

ఆ సోదరులిద్దరికీ మొక్కలు నాటడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 48 గంటల్లో 5వేల మొక్కలు నాటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ వీరెవరంటే... తమిళనాడులోని విరుద్ద్‌నగర్‌ జిల్లాకి చెందిన వారు. వీరి పేర్లు అరుణ్ (25), శ్రీకాంత్ (22). అరుణ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. చెన్నైలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
Indian Book of Records: ఈ సోదరులు 48 గంటల్లో 5000 మొక్కలు నాటారు... ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు

2019లో వీరిద్దరూ కలిసి ప్లాస్టిక్‌ని బ్యాన్ చేయాలంటూ అవగాహన కల్పించేందుకు కన్యాకుమారి నుంచి ముంబయి వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఇందుకోసం వీరికి 11 రోజులు పట్టింది. ఈ ర్యాలీ కూడా అప్పట్లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. అనంతరం 2020లో లాక్ డౌన్ కారణంగా వారు ఎటువంటి అవగాహన ర్యాలీలు చేయలేకపోయారు. లాక్ డౌన్ కారణంగా ఖాళీ సమయంలో వీరిద్దరూ ఇంటికి వెనకాల ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు పెంచడం ప్రారంభించారు. అలా వారు గార్డెనింగ్ పై మక్కువ పెంచుకున్నారు. 

Also Read: Prabhakar Pradhan: యాక్సిడెంట్లో చేతులో పోయినా... తన అభిరుచిని పక్కన పెట్టలేదు... అనుకున్నది సాధించాడు

2021 జనవరిలో వీరికి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్న ఆలోచన తట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మొక్కలు నాటడం వలన ఎంతో ఉపయోగం అని గుర్తించారు. ముందుగా విరుద్ద్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ చెట్లు నాటొచ్చో తెలుసుకునేందుకు మరోసారి సైకిల్ సవారీ మొదలుపెట్టారు. పలువురు వాలంటీర్లను కలిసి వారి ఐడియాను పంచుకున్నారు. మొక్కలు ఎక్కడెక్కడ నాటొచ్చు, నీటి సదుపాయం ఎక్కడ ఉంది తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. అందరూ మద్దతు తెలపడంతో రోజుకి 8 గంటల చొప్పున 6 రోజుల పాటు విరుద్ద్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 5వేల మొక్కలు నాటారు. మొక్కలు నాటి వదిలివేయకుండా వాటికి రక్షణగాఫెన్సింగ్ కూడా వేశారు. 

ఈ కార్యక్రమానికి ముందుగా ఈ సోదరులు తాము దాచుకున్న సొమ్మునే వాడారు. తర్వాత స్నేహితులు ఇచ్చిన ఐడియా మేరకు ఫండ్స్ కోసం ప్రయత్నించారు. శివకాశీ నుంచి ఓ ప్రైవేటు సెక్టార్ వారు మాకు ఫండ్స్ అందించారు. సెప్టెంబరు 14న విరుద్ద్‌నగర్ జిల్లా కలెక్టర్ మేఘనాథ రెడ్డిని కలిసి తమ ప్రయత్నాన్ని వివరించారు. వారి నుంచి అనుమతి తీసుకుని 48 గంటల్లో 5వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో వారికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. త్వరలో జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమౌతున్నట్లు ఈ సోదరులు చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget