అన్వేషించండి

జేడీఎస్‌లో చిచ్చు, తనదే అసలైన పార్టీ అంటున్న ఇబ్రహీం

పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తు వ్యవహారం జనతా దళ్‌ సెక్యులర్‌ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తీసుకున్న పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం ఉంది.

పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తు వ్యవహారం జనతా దళ్‌ సెక్యులర్‌ పార్టీలో చిచ్చు రాజేసింది. పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తీసుకున్న పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్‌ చేరికను కర్ణాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్ఠానం తీరుకు నిరసనగా కొంత మంది పార్టీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు. బీజేపీతో కలిసి వెళ్లొద్దని దేవెగౌడను కోరిన రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం, సెక్యులర్‌గా ఉన్న తన వర్గమే అసలైన జేడీఎస్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలతో కలిసి పని చేయలేమన్న ఇబ్రహీం, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరు, ఎలా, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూద్దామన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలియజేస్తానన్నారు. ఇబ్రహీం ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రుడన్న ఆయన, ఇబ్రహీం నిర్ణయం కోసం తామంటా వేచి చూస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. 

ఆ అధికారం నాదే
జేడీఎస్‌ కర్ణాటక అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, తనకే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ సుప్రీం హెచ్ డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలు, బీజేపీతో వెళ్లాలనుకొంటే వెళ్లొచ్చని, తాము మాత్రం కలిసి నడిచేది లేదని హెచ్చరించారు. కమలం పార్టీతో కలిసి నడిచేది లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇబ్రహీం తెలిపారు. తనతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ఆయన, పేర్లు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో సమావేశం అవుతానని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.ఎన్డీఏలో జేడీఎస్​ చేరదంటూ పార్టీ అధినేత దేవెగౌడ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్టీలో చీలిక ఏర్పడ్డట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమదే అసలైన సెక్యులర్ వర్గమని ప్రకటించేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని ఆ పార్టీ అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ- జేడీఎస్​ పొత్తు తర్వాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో పలువురు జేడీఎస్​ నేతలు పార్టీని వీడారని గుర్తు చేశారు.

గత నెలలోనే ఎన్డీఏలో చేరిన జేడీఎస్

జేడీఎస్‌ పార్టీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో సెప్టెంబరు 22న అధికారికంగా చేరింది. కమలం పార్టీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్‌ మధ్య పొత్తు పొడుపులపై ఊహాగానాలకు తెరపడింది. కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న జేడీఎస్‌, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని కుమారస్వామి ప్రకటించారు. ఆ పార్టీకి మాండ్యతో పాటు మరో మూడు లోక్‌సభ సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జేడీెస్ లు సీట్లపై అధికారికంగా ప్రకటించాల్సింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cryptocurrency as Property: క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించిన మద్రాస్ హైకోర్టు.. డిజిటల్ కరెన్సీలో కొత్త అధ్యాయం
క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించిన మద్రాస్ హైకోర్టు.. డిజిటల్ కరెన్సీలో కొత్త అధ్యాయం
Montha Cyclone News Update: ఏపీకి ‘మొంథా’ తుఫాన్ ముప్పు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీకి ‘మొంథా’ తుఫాన్ ముప్పు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Predator Badlands Release Date: సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే డేంజరస్ 'ప్రెడేటర్' - ఈసారి సరికొత్త స్టోరీతో వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే డేంజరస్ 'ప్రెడేటర్' - ఈసారి సరికొత్త స్టోరీతో వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Advertisement

వీడియోలు

Shubman Gill Performance | వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్మన్ గిల్
Rohit Sharma Records | India vs Australia ODI Series | రికార్డుల మోత మోగించిన రోహిత్
India vs Australia | Women's World Cup | ఆసీస్ తో భారత్ ఢీ
India vs Bangladesh | Women's World cup | బంగ్లాతో తలపడనున్న భారత్
Virat Kohli 2nd Highest Scorer in ODI Cricket | దేవుడు తర్వాత దేవుడిలా మారిన కింగ్ విరాట్ కోహ్లీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cryptocurrency as Property: క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించిన మద్రాస్ హైకోర్టు.. డిజిటల్ కరెన్సీలో కొత్త అధ్యాయం
క్రిప్టోకరెన్సీని ఆస్తిగా ప్రకటించిన మద్రాస్ హైకోర్టు.. డిజిటల్ కరెన్సీలో కొత్త అధ్యాయం
Montha Cyclone News Update: ఏపీకి ‘మొంథా’ తుఫాన్ ముప్పు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీకి ‘మొంథా’ తుఫాన్ ముప్పు.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Telangana Employees Salaries: తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
తెలంగాణ ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. అర్ధరాత్రి వరకు టైమ్, లేకపోతే జీతాలు బంద్!
Predator Badlands Release Date: సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే డేంజరస్ 'ప్రెడేటర్' - ఈసారి సరికొత్త స్టోరీతో వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే డేంజరస్ 'ప్రెడేటర్' - ఈసారి సరికొత్త స్టోరీతో వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Adilabad Crime News: న్యూడ్ ఫోటోలు, వీడియోలతో విద్యార్థినులను బ్లాక్ మెయిల్.. ఆదిలాబాద్ లో ఇద్దరి అరెస్టు
న్యూడ్ ఫోటోలు, వీడియోలతో విద్యార్థినులను బ్లాక్ మెయిల్.. ఆదిలాబాద్ లో ఇద్దరి అరెస్టు
Kavitha About Martyrs: అమరవీరుల కుటుంబాలకు కవిత క్షమాపణ.. రూ.1 కోటి ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్
అమరవీరుల కుటుంబాలకు కవిత క్షమాపణ.. రూ.1 కోటి ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్
Thabitha Sukumar: నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!
నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!
Maruti E-Vitara Price: అత్యంత అధునాతన EV ని తీసుకురానున్న మారుతి! e-Vitara ఎప్పుడు ఎస్తుంది.. ధర ఎంత?
అత్యంత అధునాతన EV ని తీసుకురానున్న మారుతి! e-Vitara ఎప్పుడు ఎస్తుంది.. ధర ఎంత?
Embed widget