అన్వేషించండి

Work Life Balance : 'వర్క్ ముఖ్యమే.. కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం' ICU నుంచి ఓ CEO ఆవేదన.. జాబ్ చేసే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పోస్ట్

Indian CEO Amit Mishra : కొందరు వర్క్​లో పడితే పగలు, రాత్రి తేడా లేకుండా ఉంటారు. ముందు పని కంప్లీట్ చేసేద్దాం తర్వాత రెస్ట్ తీసుకుందామనుకునేవారు కచ్చితంగా చదవాల్సిన సంఘట ఇది.

Amit Mishra Job Life : ఆఫీస్​లో మిషన్లవలె పని చేస్తూ.. ఆరోగ్యాన్ని కరాబ్ చేసుకుంటున్న వారు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. మిషన్లు కూడా గ్యాప్ లేకుంటే పనిచేస్తూ ఉంటే అవి కరాబ్ అవుతూ ఉంటాయి. అలాంటింది మీ శరీరం గురించి ఆలోచించకుండా ఆఫీస్​ కోసం లేదా ఇతర పనుల్తో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమనేది తగదు. ఓ సీఈఓ పర్సనల్ ఎక్స్​పీరిన్సే దీనికి నిదర్శనం. 

అమిత్ మిశ్రా బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఓ మీడియా కంపెనీ సీఈఓ. అతను తన లింక్డిన్ ప్రొఫైల్​లో "WORK IS IMPORTANT BUT HEALTH IS NON-NEGOTIABLE". అంటూ రాసుకొచ్చారు. ఇది గుర్తించేసరికే చాలా లేట్​ అయిపోయిందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ICUలో ఉన్నప్పుడు దీనిని గుర్తించాల్సి వచ్చిందనే విషయం చెప్పారు. అసలు ఈ సీఈఓకి ఏమైంది? ఆరోగ్యం గురించి ఇలాంటి స్టేట్​మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పనిలో పడి పడి వర్క్ చేస్తూ నిజంగానే ఆరోగ్యాన్ని అందరూ విస్మరిస్తున్నారా? 

అసలు ఏమైందంటే.. 

ఓ రోజు అమిత్ మిశ్రా వర్క్​లో ఉండగా.. అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం రావడం స్టార్ట్ అయిందట. ఎలాంటి కాటన్ పెట్టినా.. వాష్ బేషిన్ దగ్గరికి వెళ్లి కడిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన భయపడిపోయారట. ఆస్పత్రికి వెళ్లేసరికే.. తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు రాసుకొచ్చారు. వెంటనే వైద్యులు అతనిని ఐసీయూలో అడ్మిట్ చేసి.. వైద్య పరీక్షలు చేశారట. దానిలో భాగంగా బీపీ చెక్ చేస్తే.. అది 230 ఉందని తెలిసి అందరూ షాక్ అయ్యారట. 

వైద్యులు 20 నిమిషాలు కష్టపడితే కానీ ఆ రక్తస్రావం తాత్కలికంగా కూడా అదుపులోకి రాలేదని తెలిపారు. అప్పటివరకు ఎలాంటి తలనొప్పి కానీ, కళ్లు తిరగడం వంటివి కానీ.. గతంలో కూడా బీపీ వచ్చినట్లు సంకేతాలు లేవని తెలిపారు. చాలా సైలెంట్​గా వచ్చిన రక్తపోటు అతనికి ఈ పరిస్థితి తీసుకువచ్చిందని రాసుకొచ్చారు. దీనిలో భాగంగా అతను ఎక్కడ తప్పు చేశాడు. ఎందుకు సడెన్​గా ఇలాంటి దారుణమైన పరిస్థితి వచ్చిందోనని ఆలోచించుకున్నానంటూ తన ఎక్స్​పీరియన్స్ షేర్ చేశారు. 

వీకాఫ్​ వచ్చినా.. ఆఫీస్ అయిపోయినా కూడా మిశ్రా ల్యాప్​టాప్ ముందు వేసుకునే కూర్చొనేవారట. అంతా బ్యాగానే ఉంది కదా.. గ్యాప్ తీసుకోవాల్సిన అవసరమేముందని అనుకునేవాడిని అందుకే ఆరోగ్యాన్ని బాగా నెగ్లెక్ట్ చేశానని రాసుకొచ్చారు. 

గుర్తించాల్సిన విషయాలు.. 

హై బీపీ, ఒత్తిడి, ఇతర ఆరోగ్య ప్రమాదాల గురించి శరీరం ఎప్పుడూ సంకేతాలు ఇవ్వకపోవచ్చు. సైలెంట్​గా ఎటాక్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్​గా హెల్త్​ చెకప్​లు చేయించుకోవాలని మిశ్రా సూచించారు. కెరీర్ ముఖ్యమే. కానీ దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని మిశ్రా చెప్పారు. పని చేయాలన్నా ఆలోచనలో శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా మరచిపోతామని.. అలాంటివి చేయకూడదని చెప్తున్నారు. శరీరం అలసిపోయినప్పుడు దానికి బ్రేక్ ఇవ్వాలని గుర్తించుకోవాలి. చెకప్​లు చేయించుకోవడం లేదా శరీరానికి తగినంత నిద్రను, విశ్రాంతిని అందించడం చేయాలి. అత్యవసరమైన పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సమయంలో దగ్గర్లోని ఆస్పత్రులు ఏమున్నాయో.. దగ్గర్లో ఎవరున్నారో చూసుకోవాలి. 

పనిలో పడి ఆరోగ్యాన్ని విస్మరించేవారికి అమిత్ మిశ్రానే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇకనుంచి అయినా వర్క్​ లైఫ్​నే జీవితంగా కాకుండా.. బ్యాలెన్స్​ చేసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు అన్ని బాగానే ఉండొచ్చు. కానీ అన్ని ఒకటేసారి ఫ్యూచర్​లో ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి అలెర్ట్​గా ఉంటే మంచిది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Krishna Scrub Typhus Fever: కృష్ణా జిల్లాలో  వింత జ్వరాలు!
కృష్ణా జిల్లాలో వింత జ్వరాలు! "స్క్రబ్ టైఫస్ "తో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం అంటున్న డాక్టర్లు
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Advertisement

వీడియోలు

Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Krishna Scrub Typhus Fever: కృష్ణా జిల్లాలో  వింత జ్వరాలు!
కృష్ణా జిల్లాలో వింత జ్వరాలు! "స్క్రబ్ టైఫస్ "తో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం అంటున్న డాక్టర్లు
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Hema Chandra : శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
Balakrishna: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
Rajinikanth : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
Embed widget