అన్వేషించండి

Foods Not To Combine Ayurveda : ఆయుర్వేదం ప్రకారం ఈ ఫుడ్స్ కలిపి తినకూడదట.. పెరుగుతో మామిడి పండు, గులాబ్ జామున్​తో ఐస్ క్రీమ్

Avoid These Food Combinations : కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే కొన్ని ఆహారాలు కలిపి తీసుకోకూడదని చెప్తుంది ఆయుర్వేదం. ఇంతకీ ఆ ఫుడ్ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం. 

Gut Health Ayurveda : ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహారాలను కలిపి తీసుకోకూడదట. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని.. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. అయితే వీటిలో కొన్ని హిట్ ఫుడ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఏ ఫుడ్స్​ని కలిపి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో.. వాటిని ఎందుకు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

పాలు, పండ్లు

పాలతో పాటు పండ్లను కలిపి అస్సలు తీసుకోకూడదట. పుల్లని, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను పాలతో కలిపి తీసుకోకూదని చెప్తున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్ తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు పెరుగుతాయి. అంతేకాకుండా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఇది కడుపు ఉబ్బరాన్ని, ఎసిడిటీని పెంచుతుంది. 

అరటిపండు, పాలు

చాలామంది పాలతో పాటు అరటిపండును ఎక్కువగా తీసుకుంటారు. ఇది బాగా ఫేమస్ ఫుడ్ కాంబినేషన్ కూడా. అయితే దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే మెటబాలీజం తగ్గుతుంది. దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్​కి దూరంగా ఉంటే మంచిది. 

వేడినీళ్లు, తేనె

చాలామంది తమ ఉదయాన్ని గోరువెచ్చని నీరు, తేనెతో కలిపి ప్రారంభిస్తారు. అయితే వేడి వేడి నీళ్లలో తేనె కలపడం వల్ల దానిలో యాంటీఆక్సిడెంట్లు డిస్టర్బ్ అవుతాయి. ఇవి జీర్ణ సమస్యలను, బరువును పెంచుతాయి. కాబట్టి గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకోవచ్చు కానీ.. వేడి నీళ్లలో కలిపి తీసుకోకూడదు. 

నెయ్యి, తేనె

నెయ్యి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు విడుదలవుతాయి. ఇది జీర్ణ సమస్యలను పెంచి.. సహజంగా దాని ప్రాసెస్​ను తగ్గిస్తుంది. 

టీతోపాటు తింటే.. 

చాలామంది ఫుడ్ తిన్న తర్వాత టీ తాగుతారు. అయితే ఇది అస్సలు మంచి అలవాటు కాదట. ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం శరీరానికి అందదు. ఐరన్, కాల్షియం వంటి వాటిని శరీరం తీసుకోవడం కష్టమవుతుంది. టీలోని కెఫిన్ జీర్ణ సమస్యలను పెంచుతుంది. 

గులాబ్ జామున్, ఐస్ క్రీమ్

చాలామంది గులాబ్ జామున్​ను ఐస్​ క్రీమ్​తో కలిపి తీసుకుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఇది మంచి కాంబినేషన్ కాదట. గులాబ్ జామున్ హాట్, ఐస్​ క్రీమ్ చల్లగా ఉంటే అస్సలు తినకూడదట. ఈ రెండూ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరిగి.. కడుపులో ఇబ్బంది ఏర్పడుతుందట. 

పాలు, చేపలు

చాలామంది చేపలను పెరుగుతో తినకూడదంటారు కానీ.. ఆయుర్వేదం ప్రకారం చేపలను పాలతో కలిపి తీసుకోకూడదట. ఇది జీర్ణసమస్యలను పెంచి స్కిన్​ అలెర్జీలను పెంచుతుంది. శరీరంలో టాక్సిన్లు పెరిగేలా చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

కాబట్టి ఈ ఫుడ్ కాంబినేషన్స్​కి వీలైనంత దూరంగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. దీర్ఘకాలికంగా ఈ ఫుడ్ కాంబినేషన్స్ తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అలాగే మీ శరీరానికి ఏ ఫుడ్స్ మంచిది కాదో తెలుసుకొని.. వాటిని ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Embed widget