అన్వేషించండి

High Court Stay: ఫలించని టీచర్ల ఎదురుచూపు, మరోవారంపాటు హైకోర్టు 'స్టే' పొడిగింపు

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల కేసులో కోర్టు 'స్టే'ను పొడిగిస్తూ మరో వారం రోజులపాటు కేసును హైకోర్టు వాయిదా వేయడంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది.

తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇప్పట్లో ముగిసేలా కనిపించడంలేదు. ఈ కేసుపై ఆగస్టు 7న విచారణ జరిగింది. అయితే ఈసారి అయినా కేసు కొలిక్కి వస్తుందని టచర్లంతా భావించారు. కోర్టు 'స్టే' పొడిగిస్తూ మరో వారం రోజులపాటు కేసును హైకోర్టు వాయిదా వేయడంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. ఈలోపు ఎన్నికల కోడ్‌ వస్తే ఎలా? అని టీచర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీవో నెం.5కు విడుదల చేసి టీచర్ల బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియను గతంలోనే మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

అయితే ఆ జీవోకు చట్టబద్ధత లేదని, స్పౌజ్‌ పాయింట్లపై, టీచర్‌ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన స్పెషల్‌ పాయింట్లు తదితర అంశాలపైన కొంత మంది ఉపాధ్యాయులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు గత నాలుగైదు నెలలుగా విచారణ జరుపుతూనే ఉంది. కాగా, అసెంబ్లీ ఆమోదం పొందని, చట్టబద్ధతలేని జీవో నెం.5 ద్వారా ఏవిధంగా ప్రమోషన్లు, బదిలీలు చేపడతారని పిటిషనర్లు వాదిస్తూ వచ్చారు. 

ఆ జీవోకు చట్టబద్ధత కల్పించాలని భావించిన ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెం.5కు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది. చట్టబద్ధత లభించడంతో ఇక బదిలీల ప్రక్రియ యథాతధంగా కొనసాగుతోందని అటు ప్రభుత్వం, ఇటు ఉపాధ్యాయులు భావించారు. కానీ ఆగస్టు 7న కోర్టులో కేసు విచారణ ఉండటంతో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన స్టే వెకేట్‌ అయి మార్గం సుగమం అవుతుందని ఆశించారు. ఇందులో భాగంగా కోర్టుకు జీవో నెం.5 చట్టబద్ధత దస్త్రాన్ని అధికారులు కోర్టుకి సమర్పించారు. అయితే ఆ ఫైల్‌ స్టడీ కోసం పిటిషనర్‌ తరుపు న్యాయవాది వారం రోజుల సమయాన్ని అడిగారు. దీంతో కోర్టు ఒక వారం రోజులు కేసును వాయిదా వేసింది.

ఫిబ్రవరి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అటు ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టి ముగించేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి మేరకు జీవో నెం.5కు చట్టబద్ధతను కల్పిస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారమైన ఈ కేసు కొలిక్కి వచ్చి బదిలీలకు లైన్‌క్లియర్‌ అవుతుందో లేదోనని ఉపాధ్యాయులు ఆశగా వేచిచూస్తున్న పరిస్థితి నెలకొంది. బదిలీల కోసం సుమారు 73వేల మంది ఉపాధ్యాయులు, పదోన్నతుల కోసం సుమారు 10 వేల మంది టీచర్లు ఎదురుచూస్తున్నారు.

ఈ కేసు విచారణ తిరిగి ఆగస్టు 14న విచారణకు రానుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. మరో వారం రోజుల వరకు ఇదే సస్పెన్స్‌ కొనసాగనుంది. అసెంబ్లీలో జీవో నెం.5కు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పున:ప్రారంభమవుతుందని భావించారు. దీంతో ముందే ఉపాధ్యాయులు సంబరాలు కూడా చేసుకున్నారు.తీరా కేసు విచారణ జరిగి మళ్లి వాయిదా పడడంతో ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

ALSO READ:

షెడ్యూలు ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహణ, స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా గురించి వస్తున్న పుకార్లకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన  ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్)ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 585 పోస్టులు, మహిళలకు 65 పోస్టులు కేటాయించారు. ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget