అన్వేషించండి

Group 1 Exam Timings: అభ్యర్థులకు అలర్ట్, తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ టైమింగ్స్ మార్పు

TGPSC Group 1 Exam timings | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ టైమింగ్స్ మారాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ కొత్త టైమింగ్స్ పై ప్రకటన చేసింది.

Telangana Group 1 Exam timings changed |హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేశారు. టీజీ పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ లను మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయని తెలిసిందే. తొలుత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. 

గ్రూప్ 1 మెయిన్స్‌కు 31,382 మంది క్వాలిఫై
తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్‌ 9న టీజీపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు హాజరయ్యారు. 1:50 నిష్పత్తిలో ఈ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ  జులై 7న విడుదల చేసింది. ఆ లెక్కన 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఆ అభ్యర్థులను టీజీ పీఎస్సీ మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనుంది.

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ 2024 ఎగ్జామ్ షెడ్యూలు..

- అక్టోబర్ 21, 2024: జనరల్ ఇంగ్లిష్ (అర్హత సాధిస్తే చాలు) 
- అక్టోబర్ 22, 2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
- అక్టోబర్ 23, 2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ)
- అక్టోబర్ 24, 2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
- అక్టోబర్ 25, 2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
- అక్టోబర్ 26, 2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్) 
- అక్టోబర్ 27, 2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రెండు దఫాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినా, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రక్రియను సైతం పూర్తిచేయలేకపోయింది. దాంతో గత ఎన్నికల్లో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపారు. రెండు పర్యాయాలు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినా, తప్పిదాలతో రెండు సార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు చేశారు. పేపర్లు లీకయ్యాయని ఒకసారి ఎగ్జామ్ రద్దు చేయగా, బయోమెట్రిక్ తీసుకోకుండా ఎగ్జామ్ నిర్వహించారని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం సహా పలు కారణాలతో మరోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసింది. పాత చైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయగా, అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget