అన్వేషించండి

PGCIL: పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏ లేదా సీఎంఏ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏ లేదా సీఎంఏ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరంలేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  

వివరాలు..

* ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టులు

ఖాళీల సంఖ్య: 20

పోస్టుల కేటాయింపు: జనరల్-08, ఓబీసీ-06, ఎస్సీ-02, ఎస్టీ-02, ఈడబ్ల్యూఎస్-02. వీటిలో దివ్యాంగులకు 2 పోస్టులను కేటాయించారు.

అర్హత: సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 13.11.2023 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. 13.11.1995 తర్వాత జన్మించినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, బిహేవియరల్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో రాతపరీక్షక 85 శాతం మార్కులు, గ్రూప్ డిస్కషన్‌ను 3 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు 12 శాతం మార్కులు కేటాయించారు

పరీక్ష (సీబీటీ) విధానం: మొత్తం 170 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రొఫెషనల్ టెస్ట్(PKT)-120 మార్కులు, ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(EAT)-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు ఇస్తారు. నెగటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్య్యూ నిర్వహిస్తారు.

సీబీటీ అర్హత మార్కులు: అర్హత మార్కులను PKT పరీక్షకు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించగా, EAT పరీక్షకు జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 శాతంగా, ఎస్సీ-ఎస్టీలకు 25 శాతంగా నిర్ణయించారు.

ఇంటర్వ్యూ అర్హత మార్కులు: ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.

జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

సర్వీస్ అగ్రిమెంట్ బాండ్: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేయనున్నట్లు రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2.5 లక్షలకు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరితేది: 13.11.2023.

Notification

Online Application

Website

ALSO READ:

➥ ఎయిమ్స్‌ గోరఖ్‌పుర్‌లో 142 నాన్ టీచింగ్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

➥ ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ పోస్టులు

➥ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే గ్రూప్-1, గ్రూప్- 2 నోటిఫికేషన్లు- ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Elections Phase 1 Polling: బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
బిహార్‌లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం- తొలి విడతలో పరీక్ష ఎదుర్కొంటున్న లీడర్లు వీళ్లే!
PM Kisan Yojana 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ విడత డబ్బులు మీ ఖాతా పడుతుందో లేదో ముందే చెక్ చేసుకోండి!
Gollapalli Surya Rao Health Update: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు అనారోగ్యం- గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, నిల‌క‌డ‌గా ఆరోగ్య పరిస్థితి!
Telangana cabinet : కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Bihar Assembly Elections 2025:ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు  ఏంటీ?
ఏ బూత్‌లో ఎంత మంది ఓటు వేస్తారో ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? నియమాలు ఏంటీ?
Ramachandrapuram Crime News: రామ‌చంద్ర‌పురంలో బాలిక అనుమానాస్ప‌ద మృతి; ఇంటి య‌జ‌మాని కుమారుడిపైనే డౌట్‌
రామ‌చంద్ర‌పురంలో బాలిక అనుమానాస్ప‌ద మృతి; ఇంటి య‌జ‌మాని కుమారుడిపైనే డౌట్‌
Andhra Pradesh New Districts : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జిల్లాలు, ఏడుకొత్త డివిజన్ల ప్రతిపాదన- నివేదిక సిద్ధం చేసిన కేబినెట్‌ ఉపసంఘం 
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జిల్లాలు, ఏడుకొత్త డివిజన్ల ప్రతిపాదన- నివేదిక సిద్ధం చేసిన కేబినెట్‌ ఉపసంఘం 
Embed widget