అన్వేషించండి

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి

BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ విధానంలో జులై 11 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

BEL Recruitment 2024: హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 32 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ, టెక్నీషియ‌న్, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జులై 11 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు, రాతపరీక్ష తదితరల ఆధారంగా తుది ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత.. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులకు నెలకు రూ.24,500- రూ.90,000 వరకు జీతంగా ఇస్తారు. ఇక టెక్నీషియ‌న్, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,500- రూ.82,000 వరకు జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా అందుతాయి.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 32  

➤ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ: 12 పోస్టులు

విభాగం: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్.

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి  కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీల, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

➤ టెక్నీషియ‌న్ ‘సీ’ : 17 పోస్టులు

విభాగం: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రికల్.

అర్హత: 60 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో ఐటీఐ, ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ (లేదా) పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో 3 సంవత్సరాల నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీల, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

➤ జూనియ‌ర్ అసిస్టెంట్: 03 పోస్టులు

విభాగం: బీకామ్/బీబీఎం. 

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో  బీకామ్ /బీబీఎం(మూడేళ్ల కోర్సు) డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీల, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.  

వయోపరిమితి: 01.06.2024 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు, రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపికచేస్తారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కలకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలు రెండు విభాగాలు(పార్ట్-1, పార్ట్-2) ఉంటాయి. పార్ట్-1లో 50 మార్కులకు జనరల్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పార్ట్-2లో టెక్నికల్/ట్రేడ్ నాలెడ్జ్ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో కనీస అర్హత మార్కులను ఒక్కో విభాగానికి 35 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  30 శాతం మార్కులు వస్తే చాలు.

జీతం: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు రూ.24,500- రూ.90,000. టెక్నీషియ‌న్, జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుకు రూ.21,500- రూ.82,000 ఇస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11.07.2024.

Notification

Online Application

Website

ALSO READ:

➥ ఇండియన్ కోస్ట్‌గార్డులో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Lakshmi Manchu: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
Embed widget