అన్వేషించండి

APPSC Group2 Recruitment: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, సిలబస్‌లో భారీ మార్పులు!

ఏపీలో 'గ్రూప్-2' అభ్యర్థులకు ప్రిపేప్ అయ్యే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 'గ్రూప్-2' పోస్టుల రాత పరీక్షలకు సంబంధించి తాజాగా కొత్త సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

ఏపీలో 'గ్రూప్-2' అభ్యర్థులకు ప్రిపేప్ అయ్యే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలకు సంబంధించి తాజాగా కొత్త సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అయితే ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన సిలబస్‌లో కీలక మార్పులు చేసింది.

కొత్త సిలబస్ ప్రకారం.. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం... 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక 300 మార్కులకు నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరు 150 మార్కులకు ఉంటుంది. వీటిలో పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉంటాయి. అదేవిధంగా  పేపర్-2లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష విధానం  ఇలా..

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు పరీక్ష సమయం (నిమిషాల్లో)
భారతదేశ చరిత్ర(ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర) 30 30 30
భూగోళశాస్త్రం(జనరల్‌, ఫిజికల్‌ జాగ్రఫీ, ఎకనమిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ, హ్యూమన్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ) 30 30 30
భారతీయ సమాజం(స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ, సోషియల్‌ ఇష్యూస్‌, వెల్ఫేర్‌ మెకానిజం 30 30 30
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు) 30 30 30
మెంటల్ ఎబిలిటీ (లాజికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ) 30 30 301
మొత్తం 150 150 150 

మెయిన్స్ పరీక్ష విధానం:

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు పరీక్ష సమయం (నిమిషాల్లో)
పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం) 150 150 150
పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ & టెక్నాలజీ) 150 150 150
మొత్తం 300 300 300

182 పోస్టులతో త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్..

ఈ ఏడాది జనవరిలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశించారు. కాని నాలుగు నెలలైన ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదు. అయితే తాజాగా పరీక్ష విధానం, సిలబస్ వివరాల గురించి స్పష్టత రావడంతో.. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఖాళీల వివరాలు ఇలా..

మొత్తం ఖాళీలు: 182

➛ డిప్యూటీ తహసీల్దార్: 30 పోస్టులు

➛ సబ్ – రిజిస్ట్రార్ (గ్రేడ్‌–2): 16 పోస్టులు

➛ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, సహకార: 15 పోస్టులు

➛ మున్సిపల్ కమీషనర్ (గ్రేడ్-III):  05 పోస్టులు

➛ ALO (లేబర్): 10 పోస్టులు

➛ ASO (చట్టం): 02 పోస్టులు

➛ ASO (శాసనసభ): 04 పోస్టులు

➛ ASO (GAD): 50 పోస్టులు

➛ JA (CCS): 05 పోస్టులు

➛ సీనియర్ అకౌంటెంట్, ట్రెజరీ డిపార్ట్‌మెంట్: 10 పోస్టులు

➛ జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్: 20 పోస్టులు

➛ సీనియర్ ఆడిటర్, రాష్ట్ర ఆడిట్ విభాగం: 05 పోస్టులు

➛ ఆడిటర్, పే & అలవెన్స్‌ల విభాగం: 10 పోస్టులు

Also Read:

తెలంగాణ గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర ప్రకటన ఏప్రిల్ 28న అధికారులు విడుదల చేశారు. దీనిద్వారా 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 728 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 218 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 2379 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 594, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

బీఎస్‌ఎఫ్‌లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు- వివరాలు ఇలా!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌) గ్రూప్-సి కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Embed widget