అన్వేషించండి

AP DSC Hall Tickets: ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా.. డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

AP DSC Admit Cards Download | ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్లు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.inలో అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

AP DSC Hall Tickets Download | అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీకి సంబంధించి ముఖ్యమైన అప్ డేట్ వచ్చింది. ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC 2025)  హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులకు జూన్‌ 6 నుంచి జూన్ 30 వరకు మెగా డీఎస్సీ నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌సైట్ ఏపీ డీఎస్సీ అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ కొన్ని రోజుల కిందట ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు ఏప్రిల్‌ 20 నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిసిందే.

 

జిల్లా పేరు

అభ్యర్థులు

దరఖాస్తులు
1

శ్రీకాకుళం

22,648

39,235
2 విజయనగరం 18,001  31,038
3 విశాఖపట్నం  29,779  49,658
4 తూర్పు గోదావరి  38,617  63,004
5 పశ్చిమ గోదావరి  25,750   42,466
6 కృష్ణా  19,953   35,220
7 గుంటూరు   25,067   43,570
8 ప్రకాశం  21,046   35,095
9 నెల్లూరు   15,993   28,772
10 చిత్తూరు    26,501    45,221
11 కడప    15,812  29,915
12 కర్నూలు    39,997    73,605
13 అనంతపురం    29,078    50,475
14 ఇతర రాష్ట్రాల వారు  7,159     10,143

ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC) నోటిఫికేషన్‌కు భారీగా స్పందన లభించింది. మొత్తం 3.35 లక్షల మంది మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల  దరఖాస్తు గడువు ముగియగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తులతో కలిపితే మొత్తం పోస్టులకుగానూ 5 లక్షల 77 వేల 417 అప్లికేషన్లు వచ్చినట్లు అయింది. ఇతర రాష్ట్రాల నుంచి 7159 మంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పేపర్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 39,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి అత్యల్పంగా 15వేల 8 వందల 12 మంది అభ్యర్థులు డిఎస్సి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. మే నెలాఖరు నుంచి హాల్ టికెట్లు జారీ చేయాలని విద్యాశాఖ భావించింది.. జూన్ 6న ఏపీ మెగా డీఎస్సీ టీచర్ పోస్టుల పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మాక్ టెస్టులు పూర్తి.. 

మే 20 నుంచి మెగా డీఎస్సీ అభ్యర్థులకు మాక్‌ టెస్టులు నిర్వహించారు. తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు హాల్‌టికెట్లు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అనంతరం 7 రోజుల పాటు డీఎస్సీ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల గడువు ముగిసిన వారం రోజులకు ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల కానుంది. డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఫలితాలు మెరిట్ జాబితా రూపంలో విడుదల చేస్తారు. అనంతరం మెరిట్ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేసన్ ప్రక్రియ చేపడతారు. అనంతరం రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులకుగానూ తుది ఎంపిక పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించనున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget