అన్వేషించండి

AP Jobs: ఏపీ యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు 46 వేల దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 14 మంది పోటీ

AP Universities Jobs: రాష్ట్రవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 ఉద్యోగాలకుగాను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు మొత్తం 46,150 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

AP Universities Job Applcations: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 20తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 ఉద్యోగాలకుగాను అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor), ప్రొఫెసర్ (Professor) పోస్టులకు మొత్తం 46,150 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరిరోజైన నవంబరు 20న ఎక్కువమంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ ఒక్కరోజే 7 వేల దరఖాస్తులు అందాయి. ఈ సమస్యపై ఉన్నత విద్యామండలికి కొందరు ఫిర్యాదు చేశారు. కానీ గడువు పొడిగింపునకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు. 

దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన అభ్యర్థులు నవంబరు 27లోపు దరఖాస్తు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను  నవంబరు 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, డిసెంబరు 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

రోస్టర్‌పై కోర్టుకు..
యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీకి సంబంధించి రిజర్వేషన్ రోస్టర్‌పై కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రొవిజనల్ జాబితా జారీ ప్రక్రియను డిసెంబరు 4 దాకా చేపట్టవద్దని వర్సిటీలను న్యాయస్థానం ఆదేశించింది. రిజర్వేషన్ రోస్టర్‌పై వర్సిటీలు కౌంటర్ దాఖలు చేయనున్నాయి. ఆ తర్వాత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నాయి. 

బ్యాక్‌లాగ్ పోస్టులకు పరీక్షపై గందరగోళం..
ఏపీ వర్సిటీల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొనడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం బ్యాక్‌లాగ్ పోస్టులకు ఎలాంటి పరీక్షలూ పెట్టకూడదంటున్నారు. ఈ పోస్టుల కోసం ఒక్కో దరఖాస్తుకు అదనంగా రూ.2 వేల రుసుం చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటికీ ఒకే ఫీజు అని ప్రభుత్వం చెప్పగా... బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తులు చేస్తే అదనంగా చెల్లించాల్సి వచ్చిందని కొందరు అభ్యర్థులు చెప్పారు.

పరీక్ష విధానం..
స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.57,700 - రూ.1,82,400, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,31,400 - రూ.2,17,100, ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,44,200 - రూ.2,18,200 చెల్లిస్తారు.

ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్ ఆచార్యులు, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget