అన్వేషించండి

Heart Attack: మనిషికి మాత్రమే గుండె పోటు ఎందుకు వస్తుంది? మిగతా జీవులకు ఎందుకు రాదు?

గుండె పోటు మరణాలు ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. దానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి. వాటిలో మనిషి క్షీరదం జాతికి చెందిన వాడు. పిల్లలను కని పాలిచ్చి పెంచే జీవులను క్షీరదాలు అంటారు. మిగతా జీవులతో పోలిస్తే గుండె పోటుతో మరణించే శాతం మనుషుల్లో చాలా ఎక్కువ. అడవి జంతువుల్లో అసలు ఇది జరిగే అవకాశమే లేదు. కానీ మనిషికే ఎందుకు ఈ గుండె పోటు శాపంలా వెంటాడుతోంది? దీనికి శాస్త్రవేత్తలు కొంతవరకు సరియైన సమాధానాన్ని కనుక్కోగలిగారు. అందులో జంతువుల్లో ఉండి, మనలో లేని ఒక జన్యువే దీనికి కారణమని చెబుతున్నారు. ఆ జన్యువు పేరు ‘సీఎంఏహెచ్’. ఇది రెండు లక్షల ఏళ్ల క్రితం వరకు మనుషుల్లో ఈ జన్యువు ఉండేది. తరువాత నశించి పోయింది. దీనివల్లే మనకు గుండె తరచూ వస్తోందనేది పరిశోధకుల వాదన. 

పదిహేనేళ్ల క్రితం చింపాంజీలు, ఇతర క్షీరదాలకు కూడా గుండెపోటు సాధారణంగా వచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. అందులో దాదాపు వచ్చే అవకాశం లేదనే తేలింది. నిజానికి చింపాంజీలకు మనుషులకన్నా బద్ధకం ఎక్కువ. వాటిల్లో కూడా కొవ్వు పేరుకుపోతుంది అయినా గుండెకు మాత్రం ఏ సమస్యా రాదు. కారణం వీటిలో ఆ జన్యువు ఇంకా ఉంది. ఎలుకల్లో కూడా ఈ జన్యువు ఉంది. కొన్ని ఎలుకల్లో ఈ జన్యువును నిర్వీర్యం చేసి, కొన్ని ఎలుకల్లో ఉంచి పరిశోధన చేశారు. ఏ ఎలుకల్లో అయితే ‘సీఎంఏహెచ్’ జన్యువును నిర్వీర్యం చేశారో వాటిలో కొవ్వు శరీరంలో పేరుకుపోయి గుండె సమస్యలు మొదలయ్యాయి. సీఎంఏహెచ్ నిర్వీర్యమైతే గుండె పోటు ముప్పును పెంచుతుందని అర్థమైంది. అలాగే మాంసాహారం తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని కూడా ఈ పరిశోధనలో తేలింది.

సీఎంఏహెచ్ జన్యువు ఎప్పుడు, ఎందుకు మానవుల శరీరం నుంచి నిర్వీర్యమైపోయిందో మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు పరిశోధకులు. అది నిర్వీర్యం కాకుండా ఇప్పటికీ ఉంటే గుండె జబ్బులంటే ఏంటో, గుండె పోటు అంటే ఏంటో కూడా మనుషులకు తెలిసేది కాదని భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం 70 ఏళ్లలోపు ఎక్కువ మంది గుండె జబ్బులతో మరణిస్తున్నట్టు చెప్పింది. ఇకపై ఏటా గుండెపోటు లేదా గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య పెరుగుతుందే కానీ, తగ్గే అవకాశం లేదని తెలిపింది. 

అందుకే గుండె ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యం అధిక బరువును తగ్గించుకోవాలి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. కొంతమంది సన్నగా కనిపిస్తున్నప్పటికీ కొలెస్ట్రాల్ మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి చెక్ చేయించుకుంటే బెటర్. అలాగే గుండెకు మేలు చేసే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. మాంసాహారాన్ని తగ్గించాలి. 

Also read: వందేళ్లు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? అయితే మీరు రోజూ చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget