అన్వేషించండి

West Nile Fever: బాబోయ్ కొత్తరకం జ్వరం, పాలిచ్చే తల్లులు జాగ్రత్త - ప్రభుత్వం అప్రమత్తం

West Nile Fever Cases: కేరళలో వెస్ట్ నైల్ ఫివర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ జారీ చేసింది.

West Nile Fever Cases in Kerala: కేరళలో మరో కొత్త వ్యాధి కలవర పెడుతోంది. త్రిసూర్‌, మలప్పురం, కొజికోడ్ జిల్లాల్లో West Nile Fever కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అలెర్ట్ జారీ చేసింది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లోని అధికారులు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. దోమల సంతతిని తగ్గించాలని ఆదేశించింది. వర్షాకాలం రాకముందే అన్ని చోట్లా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేసింది. సీనియర్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం...West Nile Fever దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వెస్ట్ నైల్ వైరస్ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి ఈ వెస్ట్‌ నైల్ ఫివర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌కి పక్షులే ప్రైమరీ క్యారియర్స్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే...ఈ వ్యాధి సోకిన వాళ్లలో దాదాపు 80% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అవయవ మార్పిడి, రక్త మార్పిడి ద్వారానే కాకుండా...పాలిచ్చే తల్లుల నుంచి పిల్లలకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 

వెస్ట్ నైల్ ఫివర్ లక్షణాలివే..

West Nile Virus సోకిన వాళ్లలో చాలా మందిలో లక్షణాలు (West Nile Fever Symptoms) కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే...20% మందిలో మాత్రం సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి సోకిన వాళ్లలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, శరీరంపై దద్దులు లాంటి లక్షణాలు ఉంటున్నాయి. అయితే...ఈ వైరస్ సోకిన వాళ్లలో 1% బాధితుల్లో న్యూరో సమస్యలు తలెత్తుతున్నాయి. encephalitis వచ్చే ప్రమాదముంది. మెదడులో తీవ్రమైన మంటలు రావడంతో పాటు అది క్రమంగా వెన్ను వరకూ వ్యాప్తి చెందుతుంది. కాకపోతే...ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు చెబుతున్నారు. 

ట్రీట్‌మెంట్ ఉందా..?

వెస్ట్ నైల్ ఫివర్‌కి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ అంటూ ఏమీ లేదు. అయితే...జ్వరం, ఒళ్లు నొప్పులకు వినియోగించే మందులతో కొంత వరకూ ఈ వ్యాధిని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వాళ్లకి మాత్రం ఈ మెడికేషన్‌ సరిపోదని స్పష్టం చేస్తున్నారు. అలాంటి బాధితులను హాస్పిటల్‌లో చేర్చి IV ఫ్లుయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మందిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. బాధితుల వయసు ఆధారంగా ఈ వ్యాధి నుంచి రికవరీ అవడం ఆధారపడి ఉంటుందని కొంత మంది వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వాళ్లు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లలో మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకు మాత్రం ఎక్కువ రోజుల పాటు చికిత్స అందించాల్సి వస్తుంది. ప్రస్తుతం కేరళలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసింది. 

Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిపై నిఘా, ఆఫీస్‌కి రాని ఉద్యోగులకు రెడ్‌ఫ్లాగ్ - డెల్‌ కంపెనీ కొత్త రూల్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Mahakumbh 2025 : మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Crime News: నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
Embed widget