By: ABP Desam | Published : 20 Oct 2021 11:00 PM (IST)|Updated : 20 Oct 2021 11:07 PM (IST)
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ
PMGKP : కేంద్ర ప్రభుత్వం హెల్త్ కేర్ వర్కర్లకు శుభవార్త అందించింది. తాజాగా ముగియనున్న ఇన్సురెన్స్ పాలసీని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్19 పై పోరాటంలో విశేషంగా సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్ల కోసం కేంద్రం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పాలసీని మరో 180 రోజులపాటు వారికి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
గత ఏడాది మార్చి నెల నుంచి ఇన్సూరెన్స్ పాలసీని హెల్త్ కేర్ వర్కర్లకు కేంద్రం తీసుకొచ్చింది. దాని గడువు అక్టోబర్ 20తో ముగియనున్న క్రమంలో మరో ఆరు నెలలపాటు పాలసీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి ఇంకా ముగియలేదని.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పాలసీని మరికొంత కాలం పొడిగించారు. అక్టోబర్ 21 నుంచి మరో 6 నెలల పాటు కొవిడ్19 పేషెంట్లకు సేవలు అందించే హెల్త్ కేర్ వర్కర్లకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వర్తించనున్నాయి. ఇప్పటివరకూ 1,351 క్లెయిమ్స్ కు నగదు అందించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Also Read: రిటైర్మెంట్ ప్లానింగ్లో ఈ ఐదు పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే నష్టపోతారు!
కాంప్రిహెన్సివ్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పాలసీ కింద రూ.50 లక్షల రూపాయలను 22.12 లక్షల మందికి అందుబాటులోకి తెచ్చారు. కొవిడ్19 బాధితులకు చికిత్స, సేవలు అందించి నష్టపోయిన హెల్త్ కేర్ వర్కర్లకు మాత్రమే ఈపాలసీ వర్తిస్తుంది. కరోనా వ్యాప్తి సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రారంభించి కొన్ని నెలలపాటు కోట్లాది కుటుంబాలకు ఉచితంగా బియ్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
Also Read: రూ.1.3 లక్షల్లో అత్యంత స్టైలిష్ పవర్ఫుల్ బైక్స్.. టాప్-5 ఇవే!
ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది, రిటైర్డ్, వాలంటీర్లు, కాంట్రాక్ట్, రోజువారీ వేతనం, తాత్కాలిక మరియు ,ట్సోర్సింగ్ సిబ్బంది రాష్ట్రాలు, కేంద్ర ఆసుపత్రులు మరియు కేంద్ర, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల స్వయంప్రతిపత్త ఆసుపత్రులు, ఎయిమ్స్, జాతీయ మరియు కోవిడ్ -19 రోగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కేంద్ర మంత్రిత్వ శాఖల ఆసుపత్రులు కూడా పీఎంజీకేపీ పరిధిలోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి
Diabetes: డయాబెటిస్ ఉంటే మటన్ తినకూడదంటారు, ఎందుకు?
Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
Coronavirus Cases: దేశంలో కొత్తగా 2,202 కరోనా కేసులు- 27 మంది మృతి
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్