అన్వేషించండి

India Covid 19 Cases: దేశంలో కొత్తగా 44 వేల కరోనా కేసులు.. 464 మరణాలు

దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 44,643 కేసులు నమోదుకాగా 464 మంది మరణించారు. 41,096 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా కేసులు తగ్గినట్లు కనిపించినా మళ్లీ రోజువారి కేసులు 40 వేలకు పైనే నమోదవుతున్నాయి. కొత్తగా 44,643 కేసులు నమోదుకాగా 464 మంది మృతి చెందారు. 41,096 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.36%గా ఉంది.

  1. యాక్టివ్ కేసులు: 4,14,159
  2. మొత్తం రికవరీలు: 3,10,15,844
  3. మొత్తం వ్యాక్సినేషన్: 49,53,27,595

దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 4,14,159కి చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.30%గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 5% కన్నా తక్కువే ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.72 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్తంగా 49 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో 50.29 లక్షల (50,29,573) కొవిడ్ డోసులు పంపిణీ చేశారు. 

కొవిడ్ తో గుండెకు ముప్పు..

మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఆరోగ్యానికి పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన రెండు వారాల సమయంలో గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ది లాన్సెట్ అనే అంతర్జాతీయ జర్నల్ ఈ అధ్యయన వివరాలను వెల్లడించింది.

స్వీడన్‌లోని ఉమెయా యూనివర్సిటీ పరిశోధకులు కొవిడ్ కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. 2020 ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 14 మధ్య కాలంలో నమోదైన కొవిడ్ కేసుల వివరాలను పరిశీలించారు. దీని కోసం పూర్తి ఆరోగ్యంగా ఉన్న 3,48,481 మందిని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన 86,742 మంది ఆరోగ్య వివరాలపై పరిశోధన జరిపారు. 

అధ్యయనంలో భాగంగా స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ, స్టాటిస్టిక్స్ స్వీడన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ సంస్థల నుంచి కొవిడ్ రోగుల సమాచారాన్ని సేకరించారు. గతంలో గుండె పోటు వచ్చిన వారి వివరాలను ఈ జాబితా నుంచి తొలగించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా కొవిడ్ పాజిటివ్ వచ్చినవారికి గుండె పోటు ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని పరిగణలోకి తీసుకుని అధ్యయన ఫలితాలను వెల్లడించారు. 

కొవిడ్ సోకిన వారిలో మొదటి రెండు వారాల్లో గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు కనుగొన్నామని.. అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన ఓస్వాల్డో ఫాన్‌సికా వెల్లడించారు. పరిశోధనలో పాల్గొన్న వారి వయసు, జెండర్, సామాజిక ఆర్థిక పరిస్థితులు, వారికి గతంలో ఏమైనా అనారోగ్యం ఉందా అనే అంశాలను పరిగణలోకి తీసుకున్నా కూడా ఇవే ఫలితాలు వచ్చాయని తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
India vs New Zealand ODI : ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
ఇది కదా రో.కో. పవర్‌! 8 నిమిషాల్లో భారత్ న్యూజిలాండ్ మొదటి వన్డే టిక్కెట్లు సేల్‌!
Embed widget