By: Arun Kumar Veera | Updated at : 23 Dec 2024 11:28 AM (IST)
రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్లు 7% కూడా లేరు ( Image Source : Other )
ITR Filing For FY24: 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY 2023-24) ఆదాయ పన్ను పత్రాలను దాఖలు చేయడానికి ఈ ఏడాది (2024) జులై 31తోనే గడువు ముగిసింది. ఆ తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయడం మరిచిపోయినా/ కుదరకపోయిన వాళ్లు లేదా దాఖలు చేసిన రిటర్న్లో ఏదైనా దిద్దుబాటు ఉన్నవాళ్లు... బీలేటెడ్ ఐటీఆర్ (Belated ITR) లేదా రివైజ్డ్ ఐటీఆర్ (Revised ITR) చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు తుది గడువు (ITR Deadline) ఉంది.
బీలేటెడ్ ఐటీఆర్ విషయంలో.. డిసెంబర్ 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు గరిష్టంగా రూ. 5,000 వరకు లేట్ ఫీజ్ చెల్లించాలి. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ, ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నందుకు ఈ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒకసారి సమర్పించిన ఆదాయ పత్రాలకు సవరణలు చేసి రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్లు కూడా డిసెంబర్ 31లోగా ఆ పని పూర్తి చేయాలి.
గడువును మరచిపోతే ఏంటి నష్టం?
అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం లేదా పొరపాటున మీరు డిసెంబర్ 31 గడువును మరచిపోతే, మీరు దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొదటి విషయం, మీరు ఈ డెడ్లైన్ను మిస్ చేసి, ఆ తర్వాత ఇన్కమ్ టాక్స్ రిటర్న్ను దాఖలు చేసినప్పటికీ అన్ని రకాల రీఫండ్లను కోల్పోతారు. డిసెంబర్ 31 తర్వాత మీరు అప్డేట్ చేసిన రిటర్న్ను (Updated ITR) ఫైల్ చేయవచ్చు, దీని ద్వారా మీరు మీ పన్ను బాధ్యత (Tax liability)ను చెల్లిస్తున్నరాని మాత్రమే పేర్కొనాలి. రిఫండ్ను కోల్పోవడంతో పాటు పన్ను (ఏవైనా ఉంటే), జరిమానా, పెనాల్టీని కూడా చెల్లించాలి.
అదనపు నష్టాలు
డిసెంబర్ 31 గడువును మిస్ చేస్తే ఇంకా ఇతర ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారు పాత పన్ను విధానాన్ని (Old tax regime) ఎంచుకోలేరు. ఆలస్యంగా దాఖలు చేసే రిటర్న్లను కొత్త పన్ను విధానం (Nld tax regime)లో మాత్రమే ఫైల్ చేయాలి. కొత్త పన్ను విధానంలో అందుబాటులో లేని చాలా రకాల తగ్గింపులు & మినహాయింపులు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపులు & మినహాయింపులు (Deductions & Exemptions) పన్ను చెల్లింపుదారు 'పన్ను విధించదగిన ఆదాయాన్ని' చాలా వరకు తగ్గించడంలో సాయపడతాయి. కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను పత్రాలను సమర్పించాల్సి రావడం వల్ల టాక్స్ పేయర్ ఈ ప్రయోజనాలన్నీ కోల్పోతాడు.
రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్లు 7% కూడా లేరు
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నవాళ్లు దేశ జనాభాలో కనీసం 7% మంది కూడా లేరు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, మన దేశ జనాభా మొత్తంలో కేవలం 6.68% మంది మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేశారు. దీనిని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, దాదాపు 145 కోట్ల భారతదేశ జనాభాలో కేవలం 8 కోట్ల మంది (8,09,03,315) మాత్రమే ఆదాయ పన్ను పత్రాలు సమర్పించాలి. ఇంకో విషయం ఏంటంటే.. వీళ్లలో దాదాపు 4.90 కోట్ల మంది ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదు. అంటే, పన్ను చెల్లించిన వాళ్లు 3.19 కోట్ల మంది మాత్రమే. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రీ, ఈ విషయాన్ని గత మంగళవారం (17 డిసెంబర్ 2024) నాడు పార్లమెంటులో వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.40 కోట్ల రిటర్న్లు, 2021-22లో 6.96 కోట్లు, 2020-21లో 6.72 కోట్లు, 2019-20లో 6.48 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు పంకజ్ ఛౌధ్రీ చెప్పారు.
మరో ఆసక్తికర కథనం: రూ.78 వేల దగ్గర బంగారం, రూ.99 వేల దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్లను సైలెంట్గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Indian Railways Legal Action: రైల్వే టికెట్లు, రిజర్వేషన్లపై వ్లాగర్స్ ఇష్టరీతిన వీడియోలు.. చర్యలకు సిద్ధమైన రైల్వే శాఖ
Trump Tariffs on India: భారత్పై మరో టారిఫ్ పిడుగు! ట్రేడ్ డీల్ వేళ మరో రంగాన్ని టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
CM Revanth Reddy: నేడు 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు
Starlink India Price: స్టార్లింక్ ఇండియా ధరలు ఇంకా ప్రకటించలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ అని ప్రకటన