అన్వేషించండి

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయవద్దని, దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది.

FSSAI: రోడ్లపై ఉండే ఫుడ్ స్టాల్స్, చిన్న చిన్న కిరాణా దుకాణాలు, బడ్డీ కొట్లు, చిన్నపాటి హోటళ్లు ఇలా చాలా ప్రాంతాల్లో ప్లేట్లకు బదులు న్యూస్ పేపర్ వాడటం తెలిసిందే. వాడేసిన న్యూస్ పేపర్లను చిన్న చిన్న పొట్లాలు కట్టేందుకు వాడుతుంటారు చాలా మంది. అయితే ఇలా వార్తా పత్రికలను ఆహార పదార్థాలు ప్యాక్ చేయడానికి, తినడానికి వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (FSSAI) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్ ను ఆహార పదార్థాల ప్యాకింగ్ కు వాడకూడదని వ్యాపారాలను ఆదేశించింది. వార్తా పత్రికల్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీని వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.

ఆహారం ప్యాక్ చేయడానికి, నిల్వ చేయడానికి న్యూస్ పేపర్లను వాడటాన్ని అరికట్టేందుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలిసి పని చేస్తామని FSSAI సీఈవో జి. కమలవర్ధన రావు తెలిపారు. వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్ లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయని, అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని, ఆహారాన్ని కలుషితం చేస్తాయని, అలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం సమస్యలు వస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో తెలిపారు.  

ప్రింటింగ్ కు వాడే ఇంక్ లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని FSSAI వెల్లడించింది. వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుందని, బ్యాక్టీరియా, వైరస్ లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి అనారోగ్యానికి గురి చేస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. 

న్యూస్ పేపర్లను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వాడకూడదంటూ నిషేధం విధిస్తూ FSSAI 2018లోనే నిబంధనలను నోటిఫై చేసిందని గుర్తు చేశారు. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికలను ఉపయోగించి దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడాన్ని కూడా చట్టం ప్రకారం నిషేధం. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చట్టం ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్ నే ఆహార పదార్థాలకు ఉపయోగించాలని FSSAI సీఈవో జి. కమలవర్ధన రావు కోరారు.

అనేక రకాల ఆరోగ్య సమస్యలు

రీసైకిల్ చేసిన పదార్థాలతో పేపర్లు లేదా కార్డ్‌బోర్డ్‌ పెట్టెలను తయారు చేస్తారు. వీటిలో ఉండే హానికారక రసాయనాలు జీర్ణ సంబంధిత సమస్యలకు, తీవ్రమైన దుష్ప్రభావాలకు గురి చేస్తాయి. న్యూస్ పేపర్లతో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తీసుకున్న వృద్ధులు, యువకులు, చిన్నపిల్లల్లో క్యాన్సర్ వ్యాధి సంబంధిత వ్యాధులు కూడా సంభవిస్తాయని గతంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. 

న్యూస్ పేపర్ల ప్రింటింగ్ లో ఉపయోగించే ఇంక్ లో కొన్ని హానికారక కెమికల్స్ ఉంటాయి. అవి హార్మోన్ల పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తాయి. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. FSSAI ప్రకారం న్యూస్ పేపర్ ముద్రణలో వాడే వివిధ రకాల రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్రహాని జరిగే అవకాశం ఉంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget