అన్వేషించండి

Hungry: పదే పదే ఆకలేస్తుందా? ఈ ప్రాణాంతక వ్యాధికి సంకేతం కావొచ్చు!

అతిగా ఆకలి వేస్తుంటే అది శరీరంలో అనారోగ్యం దరి చేరే ముందు కనిపించే లక్షణం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హారం తిన్న కాసేపటికే కొంతమందికి ఆకలిగా అనిపిస్తుంది. దీని వల్ల తలనొప్పి, చిరాకుగా అనిపిస్తుంది. కడుపులో ఆకలి ఘోషిస్తుంటే ఏ పని మీద కూడా ఏకాగ్రత చెయ్యలేరు. ప్రోటీన్స్, కొవ్వు లేదా ఫైబర్ లేని ఆహారం, అధిక ఒత్తిడి లేదా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు కూడా ఆకలిగా అనిపిస్తుంది. కానీ తిన్న కొద్ది గంటల్లోనే మళ్ళీ ఆకలిగా అనిపిస్తే మాత్రం అది చాలా ప్రమాదకరం. నిరంతరం ఆకలితో ఉండటం ప్రాణాంతక వ్యాధికి సంకేతం. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణం కంటే ఎక్కువగా ఆకలితో బాధపడే వాళ్ళు చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నట్టే. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల తరచూ ఆకలిగా అనిపిస్తుంది. అధిక దాహం, బరువు తగ్గడం, అలసట వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యని పాలీఫాగియా అని కూడా పిలుస్తారు. ఇది పాలీడిప్సియా పాటు మధుమేహం వచ్చే ముందు కనిపించే ప్రధాన సంకేతాల్లో ఒకటి. దాహం, అతిగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ఆకలి, మధుమేహం

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్టు. రక్తం నుంచి గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశించదు. ఇన్సులిన్ నిరోధకత లేకపోవడం వల్ల మనం తీసుకునే ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చలేకపోతుంది. దీని వల్ల ఆకలి పెరుగుతుంది. అనియంత్రిత మధుమేహం ఉన్నవారిలో ఆకలి ఎక్కువగా ఉండటం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి రక్తంలో గ్లూకోజ్ అసాధారణంగా తగ్గడం వల్ల కూడా సంభవించవచ్చు. ఎందుకంటే శరీరం కాలేయం నుంచి నిల్వ చేసిన గ్లూకోజ్ ని విడుదల చేయడం ద్వారా స్థాయిల్ని సాధారణ స్థితికి పెంచుతుంది. దీని వల్ల కూడా ఆకలిగా అనిపిస్తుంది.

ఆకలి బాధ ఎలా ఎదుర్కోవాలి?

నిరంతరం ఆకలిగా అనిపించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నపుడు తినాలనే కోరికని నిరోధించడం చాలా కష్టం. అందుకే ఈ మార్గాల ద్వారా ఆకలి బాధ ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నెమ్మదిగా తినాలి

వివిధ అధ్యయనాల ప్రకారం నెమ్మదిగా తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తులు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యని కలిగి ఉంటారు. అందుకే ఆహారాన్ని సరిగ్గా నమలడం ద్వారా నెమ్మదిగా తినడం వల్ల ఆకలిని అడ్డుకోవచ్చు.

టీవీ, ఫోన్ పక్కన పెట్టేయాలి

తినేటప్పుడు టీవీ, మొబైల్ వంటివి చూడటం నివారించాలి. ఇలా చేస్తే మీరు ఎంత తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారు. అందుకే వాటిని పక్కన పెట్టి దృష్టి తినడం మీద ఉంచడం వల్ల తక్కువ తినగలుగుతారు. పొట్ట నిండిన వెంటనే మెదడు మనల్ని అలర్ట్ చేస్తుంది.

తినడానికి ముందు నీరు తాగాలి

భోజనాన్ని ప్రారంభించే ముందు ఒక గ్లాసు నీళ్ళని తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల ఆకలి కోరిక కొద్దిగా తగ్గుతుంది. ఆహారాన్ని రుచిగా మార్చుకునేందుకు అందులో కొద్దిగా సుగంధ ద్రవ్యాలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంచుతాయి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

ప్రోటీన్ రిచ్, అధిక ఫైబర్ ఆహారాన్ని తినాలి. అది నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం

మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎప్పుడు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రెగ్యులర్ వ్యాయామం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించవచ్చు. బరువు అదుపులో ఉండేందుకు సహాయపడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఉదయాన్నే కాఫీ, టీ కాకుండా ఇవి కలిపిన నీళ్లు తాగండి - అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
IPL 2025 Jio Offers: మీ దగ్గర రూ.100 ఉంటే చాలు, జియో హాట్‌స్టార్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం - IPL మెరుపులన్నీ చూడొచ్చు!
మీ దగ్గర రూ.100 ఉంటే చాలు, జియో హాట్‌స్టార్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం - IPL మెరుపులన్నీ చూడొచ్చు!
SSMB 29 Update: మహేష్ - రాజమౌళి షూట్‌లో మళ్లీ జాయిన్ అయిన ప్రియాంకా చోప్రా... ఒడిశా ఎయిర్‌ పోర్ట్‌లో క్యాబిన్ క్రూతో వైరల్ పిక్
మహేష్ - రాజమౌళి షూట్‌లో మళ్లీ జాయిన్ అయిన ప్రియాంకా చోప్రా... ఒడిశా ఎయిర్‌ పోర్ట్‌లో క్యాబిన్ క్రూతో వైరల్ పిక్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Embed widget