అన్వేషించండి
Advertisement
Covid Update: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గినట్లేనా? 30 వేల దిగువకు పడిపోయిన కేసులు
దేశంలో కొత్తగా 30 వేలకు దిగువనే రోజువారి కేసులు నమోదయ్యాయి. 347 మంది కొవిడ్తో మృతి చెందారు.
దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 30 వేలకు దిగువనే కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజులో 27,409 కేసులు వచ్చాయి. 82,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 347 మంది కరోనాతో మృతి చెందారు. డైలీ పాజిటివిటీ రేటు 2.23%గా ఉంది.
- యాక్టివ్ కేసులు: 4,23,127
- డైలీ పాజిటివిటీ రేటు: 2.23%
-
మొత్తం రికవరీలు: 4,17,60,458
- మొత్తం వ్యాక్సినేషన్: 173.42 కోట్ల డోసులు
వ్యాక్సినేషన్
దేశంలో సోమవారం 44,68,365 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1,73,42,62,440 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కొత్తగా 1,966 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,44,915కు చేరింది.
కేరళ
- కేరళలో కూడా కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఒక్కరోజులో 8,989 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్తో మరో 178 మంది మృతి చెందారు.
- కర్ణాటకలోనూ కేసులు తగ్గాయి. కొత్తగా 1,568 మందికి వైరస్ సోకింది. మహమ్మారి కారణంగా మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో తాజాగా 586 కేసులు నమోదు అయ్యాయి.
Also Read: Corona Variant: కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’ ఉనికి నిజమే కావచ్చు, యూకేలో బయటపడుతున్న కేసులు
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion