By: ABP Desam | Updated at : 17 Jan 2022 12:26 PM (IST)
Edited By: Murali Krishna
పిల్లలకు కరోనా వ్యాక్సిన్
కరోనా వ్యాక్సినేషన్లో మరో కీలక మైలురాయిని అందుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా అందించే కార్యక్రమం త్వరలోనే చేపట్టనున్నట్లు NTAGI ఛైర్మన్ డా. ఎన్కే అరోరా తెలిపారు. ఫిబ్రవరి చివరి నుంచి ఈ వ్యాక్సినేషన్ మొదలయ్యే అవకాశం ఉందన్నారు.
జనవరి 3 నుంచి దేశంలో 15-18 ఏళ్లు ఉన్న వారికి కొవిడ్ 19 వ్యాక్సినేషన్ మొదలైంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ వీరికి అందిస్తున్నారు. ఇప్పటివరకు 3.31 కోట్ల మంది పిల్లలకు టీకాలు అందినట్లు అరోరా వెల్లడించారు.
కొవాగ్జిన్..
దేశంలో పిల్లలందరికీ భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకానే అందిస్తున్నామని అరోరా అన్నారు. 15-17 ఏళ్ల వారికి ఫిబ్రవరి తొలి వారం నుంచే రెండో డోసు పంపిణీ కూడా మొదలువుతుందన్నారు. అది పూర్తయిన వెంటనే ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారం నుంచి 12-14 ఏజ్ గ్రూప్ వారికి టీకాలు అందించేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి క్రమంలో స్కూళ్లు మూతపడటం, ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపైనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 12-14 ఏళ్ల పిల్లకు టీకాల పంపిణీ ముఖ్యమని డాక్టర్ అరోరా అభిప్రాయపడ్డారు.
Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం
High Blood Pressure: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు
Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!