అన్వేషించండి

Covid 19 India Cases: దేశంలో కొత్తగా 39 వేల కేసులు, 491 మరణాలు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 39,070 కేసులు నమోదయ్యాయి. వీక్లీ పాడిటివ్ రేటు ప్రస్తుతం 2.38 శాతంగా ఉంది.

దేశంలో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదుకాగా 491 మంది మృతిచెందారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,06,822కు చేరింది. మొత్తం కేసుల్లో ఇది 1.27 శాతం. వీక్లీ పాజిటివ్ రేటు ప్రస్తుతం 2.38 శాతంగా ఉంది.

రోజువారి పాజిటివ్ రేట్ 2.27%గా ఉంది. గత 13 రోజులుగా డైలీ పాజిటివ్ రేట్ 3% కన్నా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.   

కేరళలో..

కేరళలో కొత్తగా 20,367 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 139 మంది కరోనా కాటుకు బలయ్యారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,78,166కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,654కు పెరిగింది. టెస్ట్ పాజిటివ్ రేటు 13.35 శాతంగా ఉంది.

ఆగస్టు 9 నుంచి 31 వరకు కేరళలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

" రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులతో పాటు మరిన్ని కావాలి. ప్రైవేట్ సెక్టార్ కు కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం 20 లక్షల వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు అదే ధరకు ఇస్తాం. వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు చేపడతాం. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన సదుపాయాలను ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎంతమందికి వీలైతే అంతమందికి వ్యాక్సిన్ వేయడమే మా లక్ష్యం.                       "
-  పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

మహారాష్ట్ర..

మహారాష్ట్రలో కొత్తగా 6,061 కరోనా కేసులు నమోదుకాగా 128 మంది మరణించారు. ముందురోజుతో పోలిస్తే కరోనా కేసులు సంఖ్య కొంచెం పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 6,347,820కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 133,845కి పెరిగింది. మొత్తం 6,139,493 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

వాణిజ్య రాజధాని ముంబయిలో కొత్తగా 332 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 737,192కి చేరగా మరణాల సంఖ్య 15,942కి పెరిగింది. కరోనా ఆంక్షలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సడలించిన నాటి నుంచి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.

వ్యాక్సినేషన్..

ఇప్పటివరకు రాష్ట్రాలు, యూటీలకు 52.37 కోట్ల (52,37,50,890) వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో  8,99,260 డోసులు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget