అన్వేషించండి

Ayurvedic Diet: ఆయుష్షు కావాలా? ఆయుర్వేదం చెప్పిన ‘70-30’ ఫార్ములా ఫాలో అయిపోండి

అతిగా తినడం నివారించడానికి ఆహారం ఎలా తినాలో ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఈ నియమాలు పాటించారంటే బరువు పెరగరు ఆరోగ్యంగా ఉంటారు.

న శరీరాకృతి, ఆరోగ్యం, నిద్ర అనేవి మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. తినేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా క్రమపద్ధతి లేని ఆహారం తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరగడం అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. అందుకే ఆహారం తీసుకునే విధానానికి ఒక పద్ధతి ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. శరీరం వాత, పిత్త, కఫ దోషాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు దోషాలు శరీరం ఎలా పని చేస్తుంది, ఎలా కనిపిస్తుంది. జీర్ణక్రియ ఎంత శక్తివంతంగా ఉంది, ఆలోచనలు, మాట తీరు ఎలా ఉందనే అన్ని అంశాలను నియంత్రిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేదం చెప్పిన ప్రకారం ఆహారం తీసుకోవాలి. అందుకు మూడు విధానాలు పాటించాలి.

ప్రాసెస్ చేయని సంపూర్ణ ఆహారం తినాలి

శరీరంలో ప్రాణ శక్తికి మూలమైన ఓజస్ ను పెంచడానికి ఆయుర్వేద ఆహారం ఉత్తమమైనది. అందులో బాదం పప్పు ఒకటి. ఆయుర్వేదం ప్రకారం బాదం పప్పులో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. వాతాన్ని సమతుల్యం చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. ప్రమేహ పరిస్థితులకు బాదంపప్పు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రీడయాబెటిస్, ఊబకాయం, డయాబెటిస్ మెల్లిటస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వాటిని తగ్గిస్తుంది. మధుమేహ సమస్యలు, బలహీనత తగ్గించుకునేందుకు బాదంపప్పు తీసుకోవచ్చు.

రాత్రి భోజనం తేలికగా ఉండాలి

సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో జీర్ణశక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అందుకే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం పూట కాస్త పొట్టకి ఎక్కువ అయ్యేలా తిన్నా ఏమి కాదు. ఇది ఆహారాన్ని జీర్ణించుకోగలుగుతుంది. కానీ రాత్రి వేళ మాత్రం అలా చేయకూడదు. పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి 10 గంటల్లోపు భోజనం ముగించాలి. నిద్ర సమయంలో అతిగా పొట్ట నిండుగా ఆహారం తీసుకోవడం వల్ల అది ఇబ్బంది పెడుతుంది. సిర్కాడియన్ రిథమ్ పనితీరు మందగించేలా చేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

70-30 నియమాన్ని అనుసరించండి

ప్లేట్ లో పెట్టినవన్నీ తినాలని ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు. ఆహారం మిగల్చకూడదని అంటారు. అందుకే కొందరు పొట్ట నిండినా కూడా ప్లేట్ లో ఉన్న ఆహారం బలవంతంగా అయినా తినేస్తారు. కానీ ఆయుర్వేద జ్ఞానం ప్రకారం సంతృప్తి చెందే వరకు మాత్రమే తినాలి. సరిపడనంత ఆహారం మాత్రమే పెట్టుకోవాలి. కూర ఎక్కువగా అన్నం తక్కువగా తీసుకోవాలి. వేగంగా తినకుండా నెమ్మదిగా బాగా నమిలి ఆహారం మింగాలి. అప్పుడే అది జీర్ణమవుతుంది. ఆహారం తీసుకునే విధానంలో 70-30 నియమాన్ని అనుసరించాలి. అంటే 70 శాతం కడుపు నింపుకుంటే 30 శాతం ఖాళీగా ఉంచాలి. అప్పుడే పొట్టలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉంటుంది. అతిగా తినడం నుంచి బయటపడొచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget