అన్వేషించండి

Waltair Veerayya OTT Release: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న ప్రముఖ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతరే చేసిందని చెప్పాలి. ఈ మూవీకు బాబీ దర్శకత్వం వహించారు. రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, అన్నదమ్ముల సెంటిమెంట్, డైలాగ్స్, ఫైట్స్ ముఖ్యంగా వింటేజ్ చిరంజీవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. థియేటర్ లో లాంగ్ రన్ లో సినిమాను ప్రదర్శించారు. అయితే ఈ మూవీ నుంచి ఇప్పుడు మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో శరవేగంగా సినిమాలు చేస్తున్నారు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాల్లో నటిస్తూ దట్ ఈజ్ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అప్పటిదాకా నటించిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో చిరంజీవి నటన చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంతగా చిరంజీవి కథను నమ్మి ఈ సినిమాను చేశారు. దర్శకుడు బాబీ కూడా స్వతహాగా చిరంజీవి వీరాభిమాని కావడంతో అభిమానులకు ఏం కావాలో అదే తెర మీద కూడా తీర్చిదిద్దాడు. దీంతో సిల్వర్ స్క్రీన్ పై మెగా జాతర మొదలైంది. దీనికి తోడు సినిమాలో రవితేజ కూడా ప్రత్యేక పాత్రలో నటించడం, స్క్రీన్ పై చిరంజీవి, రవితేజ మధ్య అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అవ్వడంతో సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టారు. దీంతో ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది. 

ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే అభిమానులకు మంచి వార్తను అందించింది మూవీ టీమ్. ఈ మూవీను ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 27న ఈ మూవీను డిజిటల్ వేదికగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేయనున్నారు. ఆయన తదుపరి ‘భోళా శంకర్’ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఈ మూవీకు సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో ఈ మూవీకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు మేకర్స్.

Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget