అన్వేషించండి

Trinayani Serial Today September 19th: 'త్రినయని' సీరియల్: గాజులతో మాయం అయిపోతాననుకొని అందరి ముందు పరువు పోగొట్టుకున్న తిలోత్తమ!

Trinayani Today Episode విశాలాక్షి అందరి ముందు తన పరువు తీసిందని భావించిన తిలోత్తమ విశాలాక్షి పరువు తీయడానికి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode విశాలాక్షి తన వెంట తీసుకొచ్చిన బంగారంలో రెండు గాజులను తీసుకోమని నయనికి చెప్తుంది. నయని తీసుకుంటుంది. గజగండ వచ్చాడని అనుమానం వస్తే ఆ గాజులు ధరించమని అప్పుడు నువ్వు మాయం అవుతావని విశాలాక్షి చెప్తుంది. గాజులు తీసే వరకు ఎవరికీ కనపడవని విశాలాక్షి చెప్తుంది మంత్రగాలు ఏ రూపంలో వచ్చినా కనిపెట్టగలవని అంటుంది. విశా నయనితో ఆ గాజులు భద్రంగా దాచుకో అని అంటాడు. నయని ఆ బంగారు గాజులతో పాటు మిగతా బంగారం కూడా తీసుకొని వెళ్తుంది. దురంధర విశాలాక్షి ఒంటి మీద ఉన్న నగలు చూస్తూ ఉంటుంది. హాసిని వచ్చి ఏంటి పిన్ని అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. 

విక్రాంత్: విశాలాక్షి నువ్వు అన్నీ చెప్తున్నావ్ కానీ బ్రో చేయి తగ్గడం గురించి చెప్పడం లేదు.
విశాలాక్షి: గురువు గారు చెప్పారు. గాయత్రీ దేవమ్మ కూడా చెప్పారు కదా చిన్నాన్న. అమ్మ పంచకమణి కూడా తీసుకొచ్చింది కదా మళ్లీ అడుగుతారు. పౌర్ణమికి భుజంగమణి కోసం వెళ్తావ్ కదా అమ్మ.
విశాల్: గజగండ ఏ రూపంలో వస్తాడా అని భయంగా ఉంది.
హాసిని: ఇప్పుడు గాజులు ఉన్నాయి కదా ఏం పర్లేదు.
విశాలాక్షి: ఆ గాజులు మీ అత్తయ్య వేసుకోవాలి అని తీసుకురమ్మని మీ ఆయనకు చెప్పింది పెద్దమ్మ. ఈ అమ్మ దాచి పెట్టిన గాజులు మీ ఆయన తీసుకొని వాళ్ల అమ్మకి ఇచ్చారు. 
విక్రాంత్: బంగారు గాజులు ఎత్తేసిన వాళ్లు మాయమై విశాలాక్షి తెచ్చిన బంగారం కూడా ఎత్తేయాలి అనుకుంటున్నారేమో.
విశాలాక్షి: అచ్చుగుద్దినట్లు చెప్పావు చిన్నాన్న. ఆ గాజులు వేసుకున్నా సరే మాయం అవ్వరు. అలా చెప్తే ఎవరి మనసులో ఏముందో బయట పడుతుందని అలా చెప్పాను. 
నయని: విశాలాక్షి పరీక్షించింది.
హాసిని: ఆ గాజులు వేసుకొని ఇక్కడికి అత్తయ్య వస్తుంది. 
విశాల్: కనిపిస్తారు అనే విషయం తిలోత్తమ అమ్మకు తెలీదు కదా. 

తిలోత్తమ వస్తే అందరూ అత్తయ్య కనిపించినా కనిపించనట్లు నటిద్దామని హాసిని అంటుంది. అందరూ సరే అంటారు. ఎందుకు ఇలా పరీక్ష పెట్టావని విశాలాక్షిని విశాల్ అడుగుతాడు. నిజం బయటకు రావడానికి అని విశాలాక్షి చెప్తుంది. మరోవైపు తిలోత్తమ గాజులు వేసుకుంటుంది. ఇంకా మాయం కాలేదేంటి అని అనుకుంటుంది. ఇంతలో గాయత్రీ పాప అక్కడికి వస్తుంది. ఈపాపని తక్కువంచనా వేయొద్దని సుమన, వల్లభ అంటారు. ఇంతలో హాసిని అక్కడికి వస్తుంది.  తిలోత్తమ ఎదురుగా ఉన్నా కనిపించనట్లు నటిస్తుంది. కేవలం వల్లభ, సుమనలతో మాత్రమే మాట్లాడుతుంది. దాంతో ముగ్గురు తిలోత్తమ కనిపించడం లేదని అనుకుంటారు. గాజులు మనం కూడా పట్టుకోవడం వల్లే అత్తయ్య మనకు కనిపిస్తుందని సుమన అంటుంది. హాసిని గాయత్రీ పాపని ఎత్తుకొని వెళ్లిపోతుంది. 

హాసిని హాల్‌లోకి వచ్చి తిలోత్తమ ఎవరికీ కనిపించడం లేదు అని అనుకుంటుందని కేవలం సుమన, వల్లభలకే కనిపిస్తుందని అనుకుంటుందని అంటుంది. హాల్‌లోకి తిలోత్తమ వాళ్లు వచ్చినా విశాల్ అమ్మ ఎక్కడుంది అని అడిగితే పని మీద బయటకు వెళ్లిందని అంటారు. సుమన, వల్లభ, తిలోత్తమలు చాలా సందడి పడతారు. ఎవరికీ కనిపించడం లేదని అనుకొని నగలు తీసుకోవాలని అనుకుంటుంది. నగల మూట దగ్గరకు వెళ్తుంది. అందరూ సినిమా చూసినట్లు చూసి లోలోపల నవ్వుకుంటారు. గాయత్రీ పాప  మాత్రం తిలోత్తమ దగ్గరకు వెళ్లి చూస్తుంది. దాంతో తిలోత్తమ ఈ పాపకి నేను కనిపిస్తున్నానా అని అంటుంది. దాంతో అందరూ మాకు కూడా కనిపిస్తున్నావ్ అని అంటారు. తిలోత్తమతో పాటు సుమన, వల్లభలు కూడా షాక్ అయిపోతారు. 

దొంగతనం చేయాలని అనుకున్న తిలోత్తమను అందరూ చీవాట్లు పెడతారు. తిలోత్తమ కోపంతో ఆ గాజులు నయనికి ఇచ్చేసి వెళ్లిపోతుంది. తిలోత్తమని అవమానించిన విశాలాక్షి అంతు చూడాలని తిలోత్తమ, సుమన ప్లాన్ చేస్తారు. నీటిలో కెమికల్ కలిపిన వాటిని విశాలాక్షి మీద వేసి తాను దురదతో గోక్కునేలా చేసి చీర ఊడిపోయి గెంతులేసేలా చేసి అవమానించాలని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఇళ్లు దాటితే చచ్చినంత ఒట్టుని లక్ష్మీతో చెప్పిన యమున

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఆదివారం (మార్చి 29) టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్ - ఫుల్ లిస్ట్ ఇదే... డోంట్ మిస్
ఆదివారం (మార్చి 29) టీవీల్లో అదిరిపోయే సినిమాలున్నాయ్ - ఫుల్ లిస్ట్ ఇదే... డోంట్ మిస్
kalavari kodalu kanaka mahalakshmi serial today march 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కల్యాణంలో కూర్చొపెట్టిన స్వామీజీ! అంబికకు భుజంగం గురించి తెలిసిందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కల్యాణంలో కూర్చొపెట్టిన స్వామీజీ! అంబికకు భుజంగం గురించి తెలిసిందా!
Nindu Manasulu Serial Today March 28th: నిండు మనసులు: సిద్ధూ తండ్రిని చంపేసి విజయానంద్! ప్రేరణ తండ్రి నిజం బయట పెడతాడా!
నిండు మనసులు: సిద్ధూ తండ్రిని చంపేసి విజయానంద్! ప్రేరణ తండ్రి నిజం బయట పెడతాడా!
chinni serial today march 28th: చిన్ని సీరియల్: చిన్ని ప్లాన్ సక్సెస్‌! కోయిదొర మాటలు నమ్మేసిన నాగవల్లి నిర్ణయమేంటి?
చిన్ని సీరియల్: చిన్ని ప్లాన్ సక్సెస్‌! కోయిదొర మాటలు నమ్మేసిన నాగవల్లి నిర్ణయమేంటి?

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget