అన్వేషించండి

Trinayani Serial Today July 22nd: 'త్రినయని' సీరియల్: పుర్రెలదీవికి మంచంతో పాటు ఎగిరిపోయిన నయని, గాయత్రీపాప.. పాప బలి తప్పదా!

Trinayani Serial Today Episode గంటలమ్మ ఇచ్చిన విభూది వల్ల గాయత్రీ పాప మంచం మీద నుంచి ఎగిరిపోగా నయని కూడా అదే మంచం ఎక్కి పుర్రెలదీవికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode గంటలమ్మ వెళ్తూ వెళ్తూ పోయొస్తానే పిల్లా అని గాయత్రీ పాపని చూసి ఎందుకు అనిందో అని హాసిని నయని, విశాల్‌లను అడుగుతుంది. పిల్లలు ఇష్టం ఉండి అలా ఉంటుందని విశాల్ అంటాడు. ఇక నయని గాయత్రీ అమ్మగారి ఆత్మను సంరక్షించుకోవాలని మరోవైపు గాయత్రీ దేవిగారి పునర్జన్మలో ఆశ్రయించిన ఆ దేహానికి గండం రాకుండా చూడాలని అంటుంది. 

హాసిని: రెండు ఒకేలా అనిపించినా ప్రయత్నాలు రెండు వైపులా చేయాలి.   
విశాల్: ఏది ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 
సుమన: ఈ ఇంటికి పట్టిన ఆత్మకు విముక్తి కలుగుతుందని గంటలమ్మ చెప్పింది కదా. గాయత్రీదేవి అత్తయ్య ఆత్మ వెళ్లిపోతే మా అక్క కన్న తొలిబిడ్డ జాడ కూడా ఈ జన్మలో దొరకదు అనే కదా.
విక్రాంత్: ఇంత పైశాచికం ఏంటే నీకు. ఒకరు బాధ పడితే ఇంత ఆనంద పడతావా.
సుమన: కోట్లు ఉన్నాయని ఫోజులు కొట్టే మా అక్క ఫ్యూజులు ఎగిరిపోతాయి. మీ పెద్దమ్మ ఆత్మే మాకు అండ అన్నది కదా రేపటి నుంచి ఆపద్భాంధవులు ఎవరూ ఉండరు. 
విక్రాంత్: ఏమీ లేని ఆకువు నువ్వు. రెపరెపలాడుతావ్ నువ్వు. గంట ఊపుకుంటూ వచ్చిన ఆ గంటలమ్మని మా అమ్మ నమ్మడం ఆవిడ ఏదో చెప్తే అది అవుతుందని నువ్వు నమ్మడం. ఛీ.. ఛీ.. 

తిలోత్తమ, వల్లభలు గంటలమ్మ ఇచ్చిన విభూదిని గాయత్రీ పాప పడుకున్న మంచం కోళ్లకి రాస్తారు. ఇక నయని గాయత్రీ పాపని ఆడిపించుకుంటూ తీసుకొచ్చి పాపని విభూది రాసిన మంచం మీద పడుకోపెడుతుంది. తిలోత్తమ, వల్లభలు చాటుగా దాక్కుంటూరు. ఇక నయని పని ఉందని కిచెన్‌కి వెళ్తుంది. నయని పాపని పడుకోపెట్టి కిందకి వచ్చే సరికి పెద్ద గాలి వీస్తుంది. నయనికి ఏదో జరుగుతుందని అనుమానం వస్తుంది. తన బిడ్డకి ప్రాణ గండం ఉందని గురువుగారు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కుడి కన్ను అదురుతుంది. అపశకునంలా అనిపిస్తుందని కొంగుకు కట్టుకున్న మంత్ర పుష్పం చూస్తూ గాయత్రీ అమ్మగారికి గండం వస్తుందేమో అని అనుకుంటుంది. ఇక గాలికి గాయత్రీ పాప ఏడ్చేలా ఉందని   మీదకు పరుగులు తీస్తుంది. నయని వెళ్లే సరికి గంటలమ్మ ఇచ్చిన విభూది ఫలితంగా మంచం కదులుతూ గాల్లో తేలుతుంది. మంచం ఎగురిపోయే టైంకి నయని వస్తుంది. గాయత్రీ గాయత్రీ అని అరుస్తూ పరుగున మంచం మీదకు ఎక్కిపోతుంది. ఇక నయని, గాయత్రీ పాప ఇద్దరూ మంచం మీద ఎగురుకుంటూ గాల్లో ప్రయాణిస్తారు. గాయత్రీ పాప లేస్తే భయపడుతుందని నయని అనుకుంటుంది. ఇద్దరూ 
ఎగురుతూ పుర్రెల దీవికి వెళ్లిపోతారు. అక్కడ మాంత్రికుడు రక్త చాముండికి పూజలు చేస్తాడు. 

నయని: ఏయ్ ఎవరు నువ్వు. 
మాంత్రికుడు: నువ్వు ఎవరు.
నయని: త్రినయని..
మాంత్రికుడు: త్రినయని అనే పేరు గల సాధ్వీమని నువ్వేనా.
నయని: నీకు నేనే తెలుసా. నేను ఎప్పుడూ ఇలాంటి చోటుకి రాలేదు. ఏం చేస్తున్నావ్ ఇక్కడ.
మాంత్రికుడు:  నా పేరు రక్తపుంజి. ఎప్పుడూ విని ఉండవు. రక్త చాముండీ ఆరాధకుడిని. తాంత్రిక శక్తిని కూడగట్టుకోవడానికి తల్లిని బలి ఇస్తుంటామ్ చూస్తున్నావ్ కదా పుర్రెలదీవి ఎలా ఉందో.
నయని: పిచ్చి ప్రయత్నాలు మానుకో నా బిడ్డ నిద్ర పోతుంది. నిన్ను చూస్తే ఏడుస్తుంది. 

మాంత్రికుడు నయనిని ఎటూ కదలకుండా అగ్నితో బంధించేస్తాడు. ఇక గాయత్రీ పాప దగ్గరకు వెళ్తాడు. పుర్రెలదిబ్బలో పడుకున్నావా పాప రక్త చాముండి నిన్ను పిలుస్తుంది రా అని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాడు. నయని వద్దు నా బిడ్డను ఏం చేయొద్దని ఏడుస్తుంది. మాంత్రికుడు గాయత్రీని తన మంత్ర దండంతో మాయం చేసేస్తాడు. ఇక ఇంట్లో అందరూ నయని, గాయత్రీ పాప కలిపించడం లేదని టెన్షన్ పడతారు. తిలోత్తమ తనకు ఏం తెలీనట్లు నటిస్తుంది. ఎక్కడికీ వెళ్లిందని విశాల్ బాధ పడతాడు. సుమన విశాల్‌తో మీ కన్న తొలిబిడ్డకు ప్రాణం గండం కాబట్టి కాపాడటానికి వెళ్లుంటుందని అంటుంది. మరోవైపు నయని ఏడుస్తుంటే గాయత్రీ పాప కోసం ఏడుస్తుంది. ఇంతలో గాయత్రీదేవి ఆత్మ వస్తుంది. నయనికి బయట పడొద్దని చెప్తుంది. నయని తన బిడ్డని కాపాడమని వేడుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ప్రియుడి ఇంటికి కత్తిపీట మహారాణి.. అసలు ప్రాబ్లమ్ షురూ.. తన కోసం జ్యోని పెళ్లి చేసుకోమని కార్తీక్‌తో చెప్పిన దీప!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget