అన్వేషించండి

Trinayani Serial Today January 25th: 'త్రినయని' సీరియల్: కాలి బూడిదైన తిలోత్తమ.. పునర్జన్మ పగ సమాప్తం.. దురంధర కడుపులో మళ్లీ జన్మ!

Trinayani Today Episode తిలోత్తమ గుడికి వెళ్లడం అక్కడ గాయత్రీ పాప చేతిలో సజీవ దహనం అయి దురంధర కడుపులోకి తిలోత్తమ ఆత్మ ప్రవేశించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని, విశాల్‌లతో పాటు అందరూ గుడికి చేరుకుంటారు. అందరూ అమ్మవారిని దర్శించుకుంటారు. త్రినేత్రి కూడా వచ్చిందని ప్రదక్షిణలు చేస్తుందని విక్రాంత్ చెప్తాడు. త్రినేత్రి పూజ పూర్తి చేసేసిందని నయని తీర్థం ఇస్తానని చెప్పి గాయత్రీ పాప చేతిలో తీర్థం పెట్టి అందరికీ ఇవ్వమని అంటుంది. నయని పాపని ఎత్తుకుంటే గాయత్రీ పాప అందరికీ తీర్థం ఇస్తుంది. అందరూ పాపని పొగిడేస్తారు.

తిలోత్తమ కూడా తీసుకుంటుంది. పాప తిలోత్తమకు తీర్థం ఇవ్వగానే అమ్మవారి దివ్యదృష్టి ఆ తీర్థం మీద పడుతుంది. తిలోత్తమ తీర్థం తీసుకోగానే చేతులు వణుకుతూ తెలీకుండా ఏడుస్తుంది. గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతుంది. కళ్లు తేలేస్తుంది. గాయత్రీ అక్కయ్య నా ప్రాణం తీసుకుంటుందని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ కింద పడిపోతుంది. వల్లభ దగ్గరకు వెళ్లబోతే దగ్గరకు రాబోతుందని తిలోత్తమ వద్దని చెప్తుంది. తిలోత్తమ విలవిల్లాడిపోతుంది. అందరూ చూస్తూ ఉంటారు. అందరం అదే తీర్థం తాగాం కదా మనకు ఏం కాలేదని బామ్మ అని అంటుంది. దాంతో నయని అత్తమ్మ చనిపోయే సమయం వచ్చేసిందని అంటుంది. మా అమ్మని బలి ఇవ్వడానికి ఇక్కడికి రమ్మన్నారా అత్తయ్య నాటకం ఆడింది కదా అని వల్లభ అంటే దానికి తిలోత్తమ వల్లభతో ఎవరినీ ఏం అనొద్దురా ఇది ఆ తల్లి విశాలాక్షి అమ్మ ఆడించిన నాటకం అని అంటుంది. ఇంట్లో ఉండిపోవాల్సిన నాకు గుడికి రావాలి అని మనసు లాగిందని అదంతా దేవుడి నిర్ణయమే అని అంటుంది. అందరూ తీర్థం తాగినా ఏం కాలేదని తాను తాగగానే ఎడమ చేయి పడిపోయిందని అంటుంది. తిలోత్తమ నోటి నుంచి ముక్కు నుంచి రక్తం వస్తుంది. విశాల్ హాస్పిటల్‌కి తీసుకెళ్తానంటే తిలోత్తమ వద్దని అనేస్తుంది. 

అత్తయ్య పరిస్థితి చూసి అలాగే వదిలేస్తారా అని సుమన అడిగితే నా మీద జాలి చూపించొద్దని గాయత్రీ అక్కయ్య లక్ష్మీ పురం వెళ్లినప్పుడు జ్యూస్‌లో విషం కలిపాననని అప్పుడు అక్కయ్య కూడా ఇలాగే ప్రాణం విడిచిందని గుర్తు చేస్తుంది. మీ అమ్మ ప్రాణాలు తీసిన దుర్మార్గురాలిని నేను అని విశాల్‌తో తిలోత్తమ చెప్తుంది. దానికి నయని ఆ విషయం నా భర్తకి ఎప్పుడో తెలుసు అత్తయ్యా కానీ పెంచిన తల్లి మీద ప్రేమ చూపించారని అంటుంది. ఇక తిలోత్తమ తాను చాలా పాపాలు చేశానని పశ్చాత్తాపంతో బతకాలని లేదని ఇప్పుడు చేయి పడిపోయింది రేపు నోరు పడిపోతుందని ఇలా బతకాలి అని లేదని ఏడుస్తూ పాపని చూసి అక్కా గాయత్రీ అక్క నాకు విముక్తి ప్రసాదించు అని అంటుంది. తన చేతికి తాకి అఖండ దీపంలా వెలిగిపోయేలా చేయు అని తన చేతిని ఒక్క సారి తాకమని అంటుంది. దాంతో పాప వెళ్లి తిలోత్తమ చేయి తాకుతుంది. 

తిలోత్తమ చేయి తాకగానే పెద్ద మంట వచ్చి తిలోత్తమ కాలిపోతుంది. వల్లభ అమ్మ చేయి కాలిపోతుంది అని ఏడుస్తూ  అడ్డుకోవడానికి వెళ్తాడు. వల్లభని విశాల్ ఆపుతాడు. అందరూ చూస్తుండగానే తిలోత్తమ కాలి బూడిద అయిపోతుంది. వల్లభ చాలా ఏడుస్తాడు. బూడిది మిగలగానే దాని దగ్గర కూలబడి చాలా ఏడుస్తాడు. కనుమరుగైపోయిందని పావనా ఏడుస్తాడు. వల్లభ విక్రాంత్ రేయ్ విక్రాంత్ అమ్మ లేదురా అని ఏడుస్తాడు. వల్లభ ఏడ్వడం చూసి కంట నీరు రాక మానదు. ఇక సుమన కూడా అందరికీ క్షమాపణ చెప్తుంది. ఇప్పుడు నాకు బుద్ధొచ్చిందని తన బుద్ధి మార్చుకుంటానని అంటుంది. ఇంతలో త్రినేత్రి అక్కడికి వస్తుంది. అచ్చం నయనిలా ఉండటంతో అందరూ షాక్ అయిపోతారు.

త్రినేత్రి వచ్చి బామ్మని పట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తుంది. నయనిని చూసి త్రినేత్రి నవ్వుకుంటుంది. నయని శరీరానికి త్రినేత్రి ఆత్మ చేరిందని విక్రాంత్ పావనా, దురంధరలతో చెప్తాడు. విశాలాక్షి అమ్మే చిక్కు తీయాలని అంటాడు. ఇక దురంధర కడుపులోకి తిలోత్తమ ఆత్మ చేరుతుంది. తిలోత్తమ పునర్జన్మ ఎత్తడానికి నీ కడుపులోకి చేరిందని నయని అంటుంది. వల్లభ మనసులో ఆడపిల్ల పుడితే మళ్లీ మా అమ్మ పేరు పెట్టి గాయత్రీ పాప అంతు చూస్తానని అనుకుంటాడు. ఇక తారు మారు అయిన త్రినేత్రి త్రినయనిలు అమ్మవారికి మొక్కకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. త్రినయని సీరియల్ కూడా ఈ ఎపిసోడ్తో శుభం కార్డు పడింది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపని కాపాడమని చేతులు చాచి సాయం అడిగిన కాంచనను అవమానించిన తండ్రి..!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget